కేంద్ర మాజీమంత్రి, మాజీ నటి స్మృతి ఇరానీ మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆమె ప్రముఖ హిందీ టీవీ సీరియల్ 'కుంకీ సబ్బీ కబీ హమ్ తే' రెండో భాగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. తులసి వీరాని పాత్రలో మళ్లీ కనిపించనున్నారని చెబుతున్నారు. ఈ సీరియల్ రెండో భాగం స్క్రిప్ట్ విన్న స్మృతి, అది నచ్చడం తో నటించేందుకు అంగీకరించారని సమాచారం. అయితే ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు .


తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 25 ఏళ్ల క్రితం ఈ సీరియల్‌లో ఒక్క ఎపిసోడ్‌కు రూ. 1800 మాత్రమే పారితోషికంగా అందుకున్న స్మృతి, ఇప్పుడు అదే సీరియల్ పార్ట్ 2 కి ఎపిసోడ్‌కు రూ. 14 లక్షలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది . ఇక ఆమె కెరీర్ ఆరంభం గురించి చెప్పాలంటే, స్మృతి మొదట మెక్‌డొనాల్డ్స్‌లో ఉద్యోగిగా పని చేశారు. అక్కడ కూడా ఆమెకు నెల జీతంగా రూ. 1800 మాత్రమే లభించింది . ఏక్తా కపూర్ నిర్మాణంలో రూపొందిన ‘కుంకీ సబ్బీ కబీ హమ్ తే’ సీరియల్ మొదటి భాగం దాదాపు 150 ఎపిసోడ్లు ప్రసారమైంది .


ఇక ఇప్పుడు రెండో భాగానికి పునరావృతం కావాలన్న ఉద్దేశంతో , మొదటి భాగంలో నటించిన కొన్ని కీలక పాత్రలను మళ్లీ తీసుకోవాలని ప్రణాళిక వేసారు. ఈ క్రమంలోనే ఏక్తా కపూర్, స్మృతి ఇరానీని సంప్రదించగా ఆమె పాజిటివ్‌గా స్పందించారని , ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కూడా పూర్తయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి . తన నటనతో ఓ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్మృతి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రిగా ఎదగడం ఎంతో మందికి ప్రేరణగా మారింది. ఇప్పుడు మళ్లీ టీవీ రంగంలో అడుగుపెడతారా ? అన్నది ఆసక్తికర అంశంగా మారింది . స్మృతి ఇరానీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిన పని మాత్రమే మిగిలుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: