తాజాగా పొట్లూరి బసవరావు యార్లగడ్డపై తీవ్ర విమర్శలు చేశారు. “గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ సీనియర్లను పక్కన పెట్టి, అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. నాకు ఇచ్చిన ఎయిర్పోర్ట్ కమిటీ మెంబర్ పదవి కూడా యార్లగడ్డకు నచ్చలేదు. పార్టీ సీనియర్లతో సంబంధాలను వదిలేశాడు” అని పొట్లూరి ఆరోపించారు. అయితే వాస్తవానికి యార్లగడ్డ టీడీపీని నెత్తిన పెట్టుకున్నారు. వైసీపీపై విరుచుకుపడడంలో, స్థానిక అభివృద్ధి ప్రాజెక్టులలో కూడా ముందుండడం ఆయన ప్రత్యేకత. కానీ స్థానిక నాయకత్వం కొంతమంది వ్యతిరేకత చూపడమే గనుక ఆయనను పక్కన పెట్టిందనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.
పార్టీ అధిష్టానం ఈ విషయంలో సదా ఒకటే: “అందరు కలసి ఉండాలి”. అయితే, నాయకుల వ్యవహారం వల్ల యార్లగడ్డ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “స్థానికంగా వ్యతిరేకత పెంచేలా నాయకులు వ్యవహరిస్తే నేను ఏమాత్రం వెనక్కి తగ్గను” అని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ దశలో చంద్రబాబు పాత్ర కీలకం. సీఎంను మధ్యవర్తిగా తీసుకుని పార్టీ ఏకత్వం, నియోజకవర్గ అభివృద్ధి, సీనియర్ల మరియు కొత్త నేతల మధ్య సమతౌల్యం సాధించడం అత్యవసరం. లేకపోతే గన్నవరం టీడీపీ లోపల రాజకీయ సంక్షోభానికి దారితీస్తుంది. మొత్తంగా… గన్నవరం సీటు ఇప్పుడు యార్లగడ్డ జోష్, పొట్లూరి కోపం, పార్టీ అధిష్టాన శాంతి ప్రయత్నాల మధ్య మాస్ గేమ్గా మలిచిపోతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి