దశాబ్దం మోడీదే: గత 11 ఏళ్లుగా మోడీ దేశాన్ని పాలిస్తున్నారని, రానున్న దశాబ్దం కూడా కచ్చితంగా మోడీదే అవుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ప్రగతి శీల ప్రభుత్వం: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రగతి శీల ప్రభుత్వమని, ప్రపంచంలో భారత్ ని నిలబెట్టడానికి మోడీ చేస్తున్న కృషి అద్భుతమని కితాబిచ్చారు. మోడీ హయాంలోనే దేశంలో సంస్కరణలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని పేర్కొన్నారు. ఇండీయా కూటమికి బాబు ఫుల్ క్లారిటీ: ఇటీవల బీహార్ ఎన్నికలను ముడిపెడుతూ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని ఇండీయా కూటమి నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు చంద్రబాబు తనదైన శైలిలో బ్రేక్ వేశారు. 2029 దాకా ఆయనే: "నరేంద్ర మోడీ 2029 దాకా మరో నాలుగేళ్ల పాటు దేశానికి ప్రధానిగా విశేష సేవలు అందిస్తారు" అని బాబు స్పష్టం చేశారు. ఈ విధంగా చెప్పడం ద్వారా, మధ్యలో మోడీ ప్రభుత్వం కూలిపోతుందనే భ్రమలు పెట్టుకోవద్దని ఇండీయా కూటమికి గట్టి మేసేజ్ ఇచ్చారు.
బీహార్లో విజయం ఖాయం: ఒక రాష్ట్రంలో ఎన్నికల ఫలితం కేంద్ర ప్రభుత్వ భవిష్యత్తును తేల్చదని చెబుతూనే, బీహార్లో కూడా ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని బాబు జోస్యం చెప్పారు. టీడీపీ ఫుల్ సపోర్ట్: ఎన్డీయేలో టీడీపీ, జేడీయూ మద్దతు కీలకమని, అందులోనూ టీడీపీకే ఎక్కువ మంది ఎంపీల మద్దతు ఉందని, మోడీ నాయకత్వంపై తమ మద్దతు విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని తేల్చి చెప్పారు. ఏపీలో అభివృద్ధి: డబుల్ ఇంజన్ సర్కార్: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడటం వల్ల గడచిన పదహారు నెలల్లో విశేషమైన అభివృద్ధి జరుగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం పుంజుకోవడం, వ్యవసాయంలో ప్రగతి, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు పెద్ద ఎత్తున ఏపీకి రావడం తమ ప్రభుత్వం సాధించిన విజయాలని ఆయన వివరించారు. రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉంటే ప్రగతి దారులు కచ్చితంగా కనిపిస్తాయని అన్నారు. బాబు వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో ఎన్డీయేకు, రాష్ట్ర స్థాయిలో తన ప్రభుత్వానికి స్థిరత్వం ఉన్నాయని చాటిచెబుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి