బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు కొన్ని గంటలలో వెలుబడబోతున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గెలుపోటములు మధ్య కూడా ఎన్డీఏ కూటమి, మహాఘాట్ బంధన్ కూటమి మధ్య ఉత్కంఠ వాతావరణం ఉదయం కనిపించిన,కానీ కౌంటింగ్ లో మాత్రం ఎన్డీఏ కూటమి 172 స్థానాలలో ముందంజలో ఉంది. MGA కూటమి 66 స్థానాలలో ముందంజలో ఉంది. ఇప్పటికే అటు ఎన్డీఏ కూటమి నేతలలో కార్యకర్తలలో కూడా కోలాహలం కనిపిస్తోంది. కౌంటింగ్ మొదలైన తొలి గంటలోనే ఎన్డీఏ కూటమికి 100 సీట్లు మార్కు అందుకోవడంతో ప్రతిపక్ష పార్టీలు సైతం ఆశ్చర్యపోయారు.



ఇలాంటి తరుణంలో ప్రతిపక్ష నేత, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత అయినటువంటి తేజస్వి యాదవ్ స్పందించారు.. తేజస్వి యాదవ్  మాట్లాడుతూ గెలుపు పై తాను ధీమాతో ఉన్నానని తాము గెలవబోతున్నామంటూ , ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర అధికారంలో పెనుమార్పు రాబోతోంది చివరి వరకు ఫలితాల కోసం వేచి చూడాలి అంటూ తెలియజేశారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ క్లారిటీగా చెప్పారు తేజస్వి యాదవ్.



తేజస్వి యాదవ్ తన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్, సోదరితో పాటుగా పాట్నాలో తన నివాసం వద్ద పార్టీ అభిమానులను కలుసుకున్నారు. ముఖ్యంగా నితీష్ కుమార్ పరిపాలన పట్ల బీహార్ ప్రజలు విసిగిపోయారని అందుకే మార్పు కోరుకుంటున్నారంటు మాట్లాడారు. కానీ గెలుపు ఫలితాలు రాకపోయినప్పటికీ  ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి అధికారం చేపట్టేలా కనిపిస్తోంది. మరి ఈసారి ఎన్డీఏ కూటమిలో భాగంగా నితీష్ కుమార్ ను సీఎంగా చేస్తారా ? మరెవరినైనా సీఎంగా ఎంచుకుంటారా అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అక్కడ ఓటర్లు మాత్రం నితీష్ కుమార్ చేసిన అభివృద్ధి, పనులు సంక్షేమ పథకాలను చూసి ఓట్లు వేసినట్లుగా వినిపిస్తున్నాయి. మరి ఫలితాలు అనంతరం ఎన్డీఏ కూటమి సీఎం ఎవరిని ప్రకటిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: