మౌలిక సదుపాయాల కల్పన:
గిరిజనుల ప్రధాన సమస్య అయిన రవాణా సౌకర్యాలపై పవన్ ప్రత్యేక దృష్టి సారించారు. 'పల్లె పండుగ 2.0'లో భాగంగా గిరిజన ప్రాంతాల్లో దాదాపు 8,571 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణానికి రూ. 5,838 కోట్లు కేటాయించారు. గిరిజన గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు డోలీల మీద ఆసుపత్రికి తరలించే 'డోలీ మోతల' కష్టాలకు చరమగీతం పాడాలనేది పవన్ ప్రధాన ఉద్దేశం. గిరిజన పల్లెలను ప్రధాన మార్గాలతో అనుసంధానించడం ద్వారా వైద్యం, విద్య పట్ల వారికి భరోసా కల్పిస్తున్నారు.
జీవనోపాధి మరియు అభివృద్ధి:
కేవలం రోడ్లు మాత్రమే కాకుండా, గిరిజన ఆర్థికాభివృద్ధికి కూడా పవన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ. 375 కోట్లతో 25 వేల మినీ గోకులాలు, రూ. 16 కోట్లతో 157 కమ్యూనిటీ గోకులాలు నిర్మిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించడంతో పాటు, నీటి నిర్వహణ కోసం మ్యాజిక్ డ్రైన్ల ఏర్పాటు వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. విశాఖపట్నంలో నిర్వహించిన 'పీఈఎస్ఏ (PESA) మహోత్సవ్' గ్రాండ్ సక్సెస్ కావడం పవన్ పనితీరుకు అద్దం పడుతోంది. 10 రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరైన ఈ వేడుకను పవన్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, తన కుమారుడు అకిరా నందన్ సింగపూర్లో గాయపడిన సమయంలో కూడా, ముందుగా నిర్ణయించిన గిరిజన అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాతే పవన్ సింగపూర్ వెళ్లారు. గిరిజనుల పట్ల ఆయనకున్న ఈ అంకితభావం ప్రజల్లో బలమైన ముద్ర వేసింది.
రాజకీయ లబ్ధి కోసం కాకుండా, నిజాయితీగా గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తున్న పవన్ తీరుపై ఏజెన్సీ ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. గతంలో వైసీపీ వైపు నిలబడ్డ గిరిజన ఓటు బ్యాంకు ఇప్పుడు జనసేన వైపు మళ్లుతోందని, రానున్న రోజుల్లో ఇది రాజకీయంగా పెద్ద మార్పులకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి