బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ కు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా అండగా నిల బడ్డింది. అతడిపై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించిన అనంతరం ఆమె ఓ మీడియా సమావేశంలో మాట్లాడం జరిగింది. 'షకీబుల్ పొరపాటు చేశాడు. ఈ  విషయాన్ని షకీబుల్ హసన్  కూడా ఒప్పు కోవడం జరిగింది. ఐసీసీ నిర్ణయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం, క్రికెట్ బోర్డు ఏమి చేయలేక పోయింది. అయితే ఇలాంటి సమయంలో షకీబుల్ కు అండగా నిలవాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు సూచిస్తున్నా అంటూ హసీనా తెలియచేయడం జరిగింది.


హసీనా  ఇలా మాట్లాడుతూ... అతనొక గొప్ప క్రికెటర్. సుదీర్ఘ కాలంగా బంగ్లాదేశ్ కు ఎన్నో అపూర్వ విజయాలను సాధించాడు. అయితే నిషేధం కాలం ముగిసిన తర్వాత తిరిగి జట్టులోకి వచ్చి దేశానికి సేవచేస్తాడని ఆశిస్తున్నాం' అంటూ బీసీబీ తెలియచేయడం జరిగింది. ఫిక్సింగ్ చేసేందుకు తనను కొందరు బుకీలు సంప్రదించిన సమయంలో అవినీతి నిరోధక బృందానికి షకీబ్ సమాచారం ఇవ్వకపోవడంతో అతనిపై చర్య తీసుకున్నట్లు ఐసీసీ తెలియచేయసిన సంగతి అందరికి తెలిసిందే. గతంలో 2018లో జరిగిన రెండు టోర్నీల సందర్భంగా షకీలను బుకీ సంప్రదించడం జరిగింది. బంగ్లా కెప్టెన్ పై ఐసీసీ మూడు వేర్వేరు ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అతను తన తప్పు అంగీకరించడంతో శిక్ష విధించడం జరిగింది.


ఇక  'అవినీతికి పాల్పడేందుకు ఎవరైనా సంప్రదించినప్పుడు ఏదైనా తప్పనిసరి కారణం ఉంటే తప్ప ఆలస్యం చేయకుండా వెంటనే సమాచారం అందించాలి. ఎంత ఆలస్యం చేస్తే విచారణ అంత సంక్లిష్టంగా మారుతుంది. సరిగ్గా చెప్పాలంటే ఏ మ్యాచ్ కోసమైతే సంప్రదించారో ఆ మ్యాచ్ ముగిసేవరకు కూడా ఆగరాదు' అని ఐసీసీలోని అవినీతి నిరోధక విభాగంలో నిబంధన 2.4.4  తెలియచేస్తుంది. దీని ప్రకారం కనీసం ఆరు నెలల నుంచి గరిష్టంగా ఐదేళ్ల వరకు శిక్ష కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.


ఈ నిబంధనను షకీబ్ అతి క్రమించడం జరిగింది. అత్యంత అనుభవజ్ఞుడైన షకీబ్ కు నియమ నిబంధనలపై అన్ని రకాలుగా అవగాహన ఉందని, అయినా సరే అతను దీనిని వెల్లడించకపోవడం తప్పిదంగా భావిస్తున్నట్లు ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ వెల్లడించడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: