ఇంగ్లాండ్ జట్టు ఎంతో అద్భుతం గా రాణించడం తో టీమ్ ఇండియా ఓటమి చవి చూడాల్సినా పరిస్థితి ఏర్పడింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు టీమిండియా బౌలర్లు తో ఒక ఆట ఆడుకున్నారు అనే చెప్పాలి. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ ను తక్కువ పరుగులకే పరిమితం చేయాలని భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఇక విజయం సాధించ లేకపోయారు. చివరికి టీమిండియా ఇచ్చిన టార్గెట్ 336 పరుగులను ఇంకా ఏడు ఓవర్లు మిగిలి ఉండగానే చేదించింది ఇంగ్లాండ్.
అయితే భారత్ ఇంగ్లాండ్ రెండో వన్డే మ్యాచ్ లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంపైర్ నితిన్ మీనన్ మధ్య ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. స్టోక్స్ రనౌట్ విషయంలో అసహనానికి లోనైనా విరాట్ కోహ్లీ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ తో ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే కోహ్లీ చెప్పేందుకు వికెట్ల దగ్గర కూర్చోగా నితిన్ మీనన్ మాత్రం కోహ్లీ ని లైట్ తీసుకున్నాడు. దీంతో కోహ్లీ మరింత అసహనానికి లోనయ్యాడు.దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి