ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును యువ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. జట్టులోని ఆటగాళ్లు అందరినీ సమన్వయం చేస్తూ ప్రతి ఒక్కరు జుట్టు కోసం, జట్టు విజయం కోసం పోరాడే విధంగా అందరిలో స్ఫూర్తి నింపాడు శ్రేయస్ అయ్యర్. గత ఏడాది యువ ఆటగాళ్లతో కూడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుస్తుంది అనుకున్నప్పటికీ ఇక దిగ్గజ ముంబై ఇండియన్స్ చేతిలో టైటిల్ పోరులో ఓడి పోయి రన్నరప్ తో సరిపెట్టుకుంది. అయితే ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో శ్రేయస్ అయ్యర్ భుజం గాయం బారిన పడటంతో అయ్యర్ కి బదులుగా ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు రిషబ్ పంత్ చేతికి అప్పజెప్పింది యాజమాన్యం.
ఇకపోతే ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ భుజం గాయం నుంచి కోలుకుని పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు. దీంతో ఇక రానున్న ఐపీఎల్ సీజన్ 2 లో ఢిల్లీ కాపిటల్స్ జట్టుకు కెప్టెన్గా ఎవరు ఉండబోతున్నారు అన్నదానిపై కూడా ఆసక్తి నెలకొంది. మళ్ళీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలను తీసుకుంటాడు అని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఇక 2021 ఐపీఎల్లో రిషబ్ పంత్ కెప్టెన్గా కొనసాగుతాడు అంటూ తేల్చి చెప్పింది జట్టు యాజమాన్యం. దీంతో అటు శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నప్పటికీ ఇక కెప్టెన్సీ బాధ్యతలను మాత్రం వచ్చే సీజన్లోనే అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి