ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా వరుస పరాజయాలను చవిచూసింది ముంబై ఇండియన్స్ జట్టు. రోహిత్ శర్మ సహా జట్టులో ఉన్న ఒక ఆటగాడు కూడా సరైన ప్రదర్శన చేయలేక పోయాడు. కేవలం యువ ఆటగాళ్ల ప్రదర్శన తోనే ముంబై ఇండియన్స్ ముందుకు సాగింది అని చెప్పాలి. అంతేకాదు ఇక ప్లే ఆఫ్ లో అడుగుపెట్టకుండా ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా చెత్త రికార్డును సృష్టించింది. ఈసారి పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన ముంబై ఇండియన్స్ వచ్చే ఏడాది పక్కా ప్లాన్ తో బరిలోకి దిగబోతోంది అని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న భారత అన్ క్యాప్డ్ ప్లేయర్లకు అటు ట్రైనింగ్ కోసం ఇంగ్లాండ్ పంపించేందుకు సిద్ధమవుతున్నారట. మూడు వారాలపాటు ఇంగ్లాండ్ పిచ్ లపై ప్రాక్టీస్ చేయబోతున్నారట ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు. తిలక్ వర్మ, కుమార్ కార్తికేయ, హృతిక్, మయాంక్ మార్కండే, రాహుల్ బుద్ధి, రమన్ దీప్, థంపి, మురుగన్ అశ్విన్, ఆర్యన్, అర్జున్ టెండూల్కర్, డెవల్ట్ బేబీస్ లాంటి ఆటగాళ్లు ఇక ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ రెండు వారాల పాటు ప్రాక్టీస్ చేయబోతున్నారు అని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ కొత్త ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.