ఇక ఇప్పటివరకు భారత క్రికెట్ లో రెండు వరల్డ్ కప్ లు అందించిన ఏకైక కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని కొనసాగుతున్నాడు. ధోని తర్వాత కోహ్లీ కెప్టెన్సీ చేపట్టినప్పటికీ అటు టీమిండియా కు వరల్డ్ కప్ అందించలేకపోయాడు. అయితే మైదానంలో ఎంతో కూల్ గా ఉంటూ ఒత్తిడిలో కూడా చిరునవ్వులు చిందిస్తూ తనదైన వ్యూహాలతో మ్యాచ్ను తిప్పేస్తూ ఉంటాడు మహేంద్ర సింగ్ ధోని. తనలో ఉండే ఈ ప్రశాంతతే అతన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది అని చెప్పాలి. సోషల్ మీడియాలో ధోని ఎప్పుడూ పెద్దగా యాక్టివ్ గా ఉండడు. కానీ ఎప్పుడు ధోని కి సంబంధించిన వార్తలు మాత్రం వైరల్ గా మారిపోతూనే ఉంటాయి.
ఇకపోతే ఇటీవల టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన చదువు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని చేసిన కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. నేను పదవ తరగతి పరీక్షల్లో కూడా పాస్ అవ్వను అని మా నాన్న అనుకున్నాడు. కానీ నేను పది పరీక్షల్లో పాస్ అయ్యాను.. ఆ తర్వాత పరీక్షల్లోనూ అలాగే పాస్ అయ్యాను. అయితే అలా పాస్ అయినందుకు తన తండ్రి ఎంతో సంతోషించాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తనకు పదవ తరగతిలో 66% మార్కులు వస్తే ఇంటర్లో 55% వచ్చాయి అంటూ ఇటీవల ధోని చెప్పుకొచ్చాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి