
అయితే తన ఆట ద్వారా కాదు ఏకంగా తన ప్రవర్తన ద్వారా అభిమానుల మనుషులు గెలుచుకున్నాడు. ముఖ్యంగా ధోని అభిమానులందరూ కూడా ఇషాన్ కిషన్ పై ప్రశంసలు కురిపించేలా చేశాడు అని చెప్పాలి. ఇంతకీ ఏమైందంటే ఇటీవల వన్డే సిరీస్ ముగిసిన వెంటనే ఇండియాకు వచ్చిన ఇషాన్ కిషన్ రంజీ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్ జట్ట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇకపోతే ఇటీవల మ్యాచ్ ముగిసిన అనంతరం ఇషాన్ కిషన్ ఆటోగ్రాఫ్ కోసం ఎంతోమంది అభిమానులు వచ్చారు.
అభిమానులందరికీ ఎంతో ఓపికగా ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ ఇచ్చిన ఇషాన్ కిషన్ ఒక అభిమానికి మాత్రం ఆటోగ్రాఫ్ ఇవ్వలేను అంటూ చెప్పడం అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా ఒక అభిమాని తన ఫోన్ కి వెనకాల ఆటోగ్రాఫ్ చేయాలని కోరగా.. అప్పటికే ఆ ఫోన్ వెనకాల మహేంద్ర సింగ్ ధోని సంతకం ఉంది. అయితే నువ్వు ధోని సంతకం మీద ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అడిగావు. కానీ నేను చేయలేను. ఎందుకంటే నేను మహేంద్రసింగ్ ధోని స్థాయికి చేరుకోలేదు. కాబట్టి ధోని ఆటోగ్రాఫ్ కి కింద వైపున సంతకం పెడతా అంటూ ఇషాన్ కిషన్ చెప్పడం ధోని అభిమానులందరికీ కూడా ఆకర్షించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.