ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా వరుసగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. అన్ని టీమ్స్ కూడా అదరగొడుతున్నాయి. కానీ ఇక ప్రతి ఏడాది  టైటిల్ ఫేవరెట్ గా బరులోకి దిగి నిరాశపరిచే రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టు.. ఈసారి కూడా అలాగే బరిలోకి దిగింది. కానీ మునుపేన్నడు లేనివిధంగా ఘోరమైన పరాజయాలని చవిచూస్తుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు వాడిన బెంగుళూరు టీమ్.. కేవలం ఒకే ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో టైటిల్ గెలవడం కాదు కనీసం ప్లే ఆఫ్ లో అయినా అడుగుపెడుతుందా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయ్.



 దీంతో ఇలా టైటిల్ గెలుస్తుంది అనే ఆశ పెట్టుకుని ఎన్నిసార్లు నిరాశలో మునిగిపోవాలి అంటూ అభిమానులు కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఎందుకు ఇలా దురదృష్టం వెంటాడుతుంది అనే విషయాన్ని చర్చించుకుంటూ ఉన్నారు. ఇక ఎంతో మంది మాజీ ప్లేయర్లు కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ ఉండడం గమనార్హం. కాగా ఇక ఇటీవలే ఇలా ఐపీఎల్లో బెంగళూరు టీం దారుణం ప్రదర్శన చేస్తూ వరుస ఓటములు చవిచూస్తూ ఉండడం పై టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి స్పందించారు. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు.


 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుని కొత్త ఫ్రాంచైజీకి  విక్రయించాలి అంటూ మహేష్ భూపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రాంచైజీ పై శ్రద్ధ వహించే యజమానికి అమ్మేయాలి అంటూ సూచించారు. ఫ్యాన్స్ కోసమైనా ఆ పని చేయాలి అంటూ కోరారు. ఇటీవల సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్లో 47 కోట్లు బెంచీకే పరిమితం చేశారు అంటూ నెటిజెన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. కామరోన్ గ్రీన్ 17.5 కోట్లు, మాక్స్ వెల్ 11.5 కోట్లు, జోసెఫ్ 11 కోట్లు, సిరాజ్ 7 కోట్లు ఇక బెంచ్ కి పరిమితమయ్యారు. దీంతో ఇలా బెంజ్ పై కూర్చోబెట్టాలి అనుకున్న ఆటగాళ్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేయడం ఎందుకు అనే విషయంపై కూడా ఆర్సిబి ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb