
నేషనల్ మీడియా ప్రకారం, మిగిలిన మ్యాచ్ల కొత్త షెడ్యూల్ను త్వరలోనే రిలీజ్ చేస్తామని మొత్తం 10 జట్లకు bcci చెప్పేసిందట. మే 16 నుంచి లీగ్ మళ్లీ షురూ అవుతుంది. ఈసారి మ్యాచ్లు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లలో జరగనున్నాయి. అయితే, BCCIకి ఇప్పుడు పెద్ద తలనొప్పి విదేశీ ఆటగాళ్లను తిరిగి రప్పించడమే. ఐపీఎల్ ఆగిపోగానే చాలామంది ఫారిన్ ప్లేయర్స్ తమ దేశాలకు వెళ్లిపోయారు.
అందుకే, వాళ్ల ప్రయాణ వివరాలు, ఎప్పుడు అందుబాటులో ఉంటారో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయమని ప్రతి టీమ్కు బోర్డు చెప్పింది. జట్లు కూడా స్పెషల్ ఫ్లైట్స్ బుక్ చేసి మరీ ఆటగాళ్లను త్వరగా ఇండియాకు తీసుకురావడానికి నానా తంటాలు పడుతున్నాయి.
కానీ, పంజాబ్ కింగ్స్ (PBKS) మాత్రం తమ హోమ్ గ్రౌండ్స్కు రావడం లేదు. చండీగఢ్, ధర్మశాలలో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో, ఆ జట్టును వేరే చోటికి (న్యూట్రల్ వెన్యూ) మార్చే అవకాశం ఉంది. కాకపోతే, ఆ వేదిక ఏదనేది ఇంకా ఫైనల్ కాలేదు.
మిగిలిన మ్యాచ్లను ఫాస్ట్గా ముగించడానికి, bcci ఇకపై డబుల్ హెడర్ల అంటే ఒకే రోజు రెండు మ్యాచ్ల సంఖ్యను పెంచాలని చూస్తోంది. దీనివల్ల, టోర్నమెంట్ దాదాపుగా అనుకున్న డేట్కే పూర్తవుతుంది. కాకపోతే, ఫైనల్ డేట్లో చిన్న చేంజ్. ఐపీఎల్ 2025 ఫైనల్ ముందుగా అనుకున్నట్టు మే 25న కాకుండా, ఇప్పుడు మే 30న జరిగే ఛాన్స్ ఉంది.
మొత్తంగా చూస్తే, 12 లీగ్ మ్యాచ్లు, 4 ప్లేఆఫ్ మ్యాచ్లతో కలిపి ఇంకా 16 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. పూర్తి కొత్త షెడ్యూల్ బహుశా ఆదివారం రాత్రికి వచ్చేయొచ్చు. మళ్లీ ఏర్పాట్లు మొదలవ్వడంతో, జట్లు, ఫ్యాన్స్ అందరూ ఈ కొత్త షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.