తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలామంది యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి , ఆ తర్వాత సినిమాలలో ప్రయత్నిస్తూ దూసుకుపోతున్నారు.. మరికొంతమంది అవకాశాలు లేక తిరిగి బుల్లితెరపై సీరియల్స్ లో కి అడుగులు వేస్తూ ఉంటారు. అలాంటి వారిలో యాంకర్ ప్రశాంతి కూడా ఒకరు. ఇకపోతే ఈమె తన వాక్చాతుర్యంతో, అందంతో అందరిని ఇట్టే ఆకట్టుకునేది.. ఇక మరికొంతమంది అయితే కేవలం ప్రశాంతి కోసమే ఆమె నిర్వహించే షో ని చూసేవారట.. ఆమె ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్న యాంకర్ ప్రశాంతి ఎంత చెప్పినా తక్కువే.

ఇక సీరియల్స్ లో.. ప్రశాంతి యాంకర్ గానే అందరికీ సుపరిచితురాలు.. ప్రస్తుతం ఈమె గృహలక్ష్మి సీరియల్  లో లాస్య అనే పాత్రలో నటిస్తూ, అందరి మన్ననలు పొందుతోంది. అంతేకాదు ఒక విలక్షణమైన పాత్రలో ప్రశాంతి నటిస్తోంది..తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ తెలుగమ్మాయి. మొదట మోడల్ గా జీవితాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత యాంకర్ గా దాదాపు కొన్ని సంవత్సరాల పాటు తన జీవితాన్ని కొనసాగించింది  అయితే యాంకర్ వృత్తి బోర్ కొట్టడంతో సినిమాల వైపు, సీరియల్స్ వైపు అడుగు పెట్టి మంచి గుర్తింపు పొందుతోంది.


యాంకర్ గా బిజీగా ఉన్న సమయంలో ప్రశాంతి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సంచలమైన ఎఫైర్ అనే ఒక అడాల్ట్ చిత్రంలో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. మొట్టమొదటి లెస్బియన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో గీతాంజలి అనే అమ్మాయితో కలిసి లెస్బియన్ గా ప్రశాంతి ఈ చిత్రంలో నటించింది.ఈ సినిమా ఆమెకు క్రేజ్ ను తెచ్చి పెట్టక పోగా చాలా విమర్శలు ఎదుర్కొంది . ఇక దీంతో ఆమెకు సినిమా అవకాశాలు కూడా రాకుండా పోయాయి.. ఫలితంగా ఆమె కొన్ని సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీకి దూరమైంది అని చెప్పవచ్చు.


కొన్ని సంవత్సరాల తర్వాత ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో లాస్య పాత్రలో నెగెటివ్ రోల్ లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ప్రశాంతి.



మరింత సమాచారం తెలుసుకోండి: