
ఒక 1 జీబీ ఫైల్ డౌన్లోడ్ అవడానికి మన దగ్గర కనీసం 5–10 సెకన్లు పడుతుంటే , జపాన్ టెక్నాలజీ తో అది ఒక చుక్కలోనే పూర్తి అవుతుంది . దీనిని బుల్లెట్ ఇంటర్నెట్ అని కూడా పిలుస్తున్నారు - బుల్లెట్ రైలు స్పీడ్లా డేటా ప్రయాణిస్తుంది ! NTT సంస్థ అభివృద్ధి చేసిన ఈ సూపర్ స్పీడ్ నెట్వర్క్లో, ఆప్టికల్ ఫైబర్లో 4 స్టాండర్డ్ ఛానెళ్ల ద్వారా ఒకేసారి ట్రాన్స్మిషన్ జరిగి , నెట్వర్క్ ను బ్రేక్ లేకుండా , హై బాండ్విడ్త్ తో నడిపేలా రూపొందించారు.
ఇది ఇంకా పరిశోధన దశలో ఉంది . అయితే 2030 నాటికి ఈ టెక్నాలజీ వాణిజ్య రీతి లో వినియోగం లోకి వస్తుందని భావిస్తున్నారు . ప్రపంచ వ్యాప్తంగా డేటా వినియోగం పెరుగుతోన్న ఈ రోజుల్లో, ఈ రకమైన సూపర్ స్పీడ్ నెట్వర్క్లు అవసరమవుతాయ ని నిపుణులు చెబుతున్నారు . నెట్ఫ్లిక్స్ యూజర్లు , గేమింగ్ ప్రేమికులు , టెక్నాలజీ పై ఆసక్తి ఉన్న వారు దీని పై విపరీతంగా స్పందిస్తున్నారు . “ఒక్క క్లిక్ తో సినిమా మొబైల్లోకి వచ్చేస్తే .. అదేం ఫీలింగ్!”, “మన దేశంలో ఎప్పుడవుతుంది ఇలాంటిది ?” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు . జపాన్ టెక్నాలజీ ఇంకోసారి ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది . ఈ స్పీడ్ భారత్కి వచ్చినా, ఇంటర్నెట్ వినియోగం లో నిజంగా “కొత్త యుగం” మొదలవుతుంది!