ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో కి వెళ్లి పోయాయి అని చెప్పాలి. అయితే సాధారణంగా వరదలు వచ్చిన సమయంలో బైక్ లు, కార్లు కొట్టుకు పోవడం లాంటి వీడియోలు ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఒక బిల్డింగ్ వరదల్లో కొట్టుకుపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్న ఈ వీడియో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదల కారణంగా ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది అన్నది అర్ధమవుతుంది.
అయితే ఏపీలో ఇప్పటికే భారీగా వర్షాలు కురుస్తుండగా అటు తిరుపతి లో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అతి భారీ వర్షాలు కురుస్తూ ఉండటం గమనార్హం. తిరుపతి లో ఎక్కడ చూసినా కూడా అన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయాయ్. ఈ క్రమంలోనే ఇటీవలే తిరుచానూరులో వున్న వసుంధర నగర్ లో వరద ఉధృతికి ఏకంగా ఒక బిల్డింగ్ కొట్టుకుపోవడం కాస్త సంచలనంగా మారిపోయింది. ఇప్పటికే రోడ్డుపై ఉన్న చిన్న చిన్న దుకాణాలు సైతం వరద ఉధృతికి ధ్వంసమవుతున్నాయి. ఈ క్రమంలోనే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.