ఈ మధ్య ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు రోజుకోకటి పుట్టుకొస్తున్నాయి.. దాంతో రెస్టారెంట్లకు డిమాండ్ కూడా భారీగా తగ్గిపోయింది.. ఇక భోజన ప్రియులను ఆకర్షించడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వెలుగులో కి వచ్చింది. రైలు సర్వీస్.. ఈ పేరు వినడానికి కొత్తగా ఉంది కదూ.. కానీ హోటల్ లోపల చూస్తే అక్కడ నుంచి బయటకు రారు. అంత అందంగా ఉంటుంది. మనం ఎప్పుడైనా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ ఇస్తే మనుషులు వచ్చి ఫుడ్ ను అందిస్తారు.



విషయాన్నికొస్తే.. ఓ హోటల్ లో మాత్రం రైలు వచ్చి మనం ఆర్డర్ చేసిన భోజనాన్ని అందిస్తుంది. ఒకప్పుడు వేరే దేశాల లో ఇలాంటి సర్వీసు ఉండటం చూసి ఉంటారు. హైదరాబాద్‌ కూకట్‌ పల్లి లోని 'ప్లాట్‌ఫామ్‌-65' రెస్టారెంట్‌ కు వెళ్లాల్సి ఉంటుంది. థీమ్‌ బేస్డ్‌ రెస్టారెంట్ల కు పెరుగుతున్న ఆదరణకు ఇదో సాక్ష్యం అని చెప్పొచ్చు. ఇక్కడ టేబుళ్లు, కుర్చీలు.. అన్నీ ట్రైన్‌ లో ఉండే సీట్ల లాగే ఉంటాయి. అక్కడ కూర్చుంటే మీకు ట్రైన్‌ లో కూర్చున్న అనుభూతే కలుగుతుంది.



వరంగల్‌, విశాఖపట్నం, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి గమ్యస్థానాలను స్టేషన్‌ పేర్ల తో సహా రూపొందించారు. ఆయా మార్గాల్లోని పట్టణాలు, ప్రముఖ పుణ్య క్షేత్రాలు, చారిత్రక కట్టడాలను కూడా గోడల పై పెయింట్‌ చేశారు. ఇందులో మీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుని.. అక్కడ కూర్చోవచ్చు. ఇక వడ్డన విషయానికొస్తే ఈ రెస్టారెంట్లో సర్వర్ల కు బదులు బుల్లి బుల్లి ట్రైన్లు మనం ఆర్డర్‌ చేసిన వెరైటీల ను తెచ్చి ఇస్తాయి... అయితే అక్కడ రేటు కూడా చాలా తక్కువే.. ఇద్దరు మనుషుల కు కేవలం 1000 రూపాయలు మాత్రమే అవుతుంది. కూకట్ పల్లి వైపు వెళితే ఒకసారి ఈ సర్వీసును ఎంజాయ్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: