ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ స్కోడా తన కుషాక్ ఎస్‌యూవీ కార్ ని జూన్ 28 న దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయడం జరిగింది. తరువాత అతి తక్కువ కాలంలోనే ఈ ఎస్‌యూవీ కార్ డెలివరీలు కూడా ప్రారంభించబడ్డాయి. అయితే మొదట్లో స్కోడా కుషాక్ 1.0 లీటర్ టిఎస్ఐ యూనిట్ డెలివరీలు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కుషాక్ 1.5 లీ టిఎస్ఐ మోడల్ డెలివరీలను ప్రారంభించినట్లు స్కోడా ఆటో ఇండియా ప్రకటించడం జరిగింది.ఇక ప్రస్తుతం స్కోడా కుషాక్ కంపెనీ అన్ని అధికారిక డీలర్‌షిప్‌లలో అమ్మకానికి బాగా అందుబాటులో ఉంది. అలాగే స్కోడా కుషాక్ ఎస్‌యూవీ కార్ ధర వచ్చేసి భారతీయ మార్కెట్లో రూ. 10.50 లక్షల నుండి రూ. 17.60 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య అందుబాటులో ఉందట.

ఇక స్కోడా కంపెనీ తన కుషాక్ ఎస్‌యూవీ కార్ ని ప్రారంభించినప్పటి నుంచి కూడా అద్భుతమైన స్పందనను దక్కించుకుంది. ఇక ఈ ఎస్‌యూవీ కార్ భారత మార్కెట్లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికే 6000 యూనిట్లకుపైగా బుకింగ్స్ ని దాటడం జరిగింది. అయితే, కస్టమర్‌లు ఏ ట్రిమ్ లేదా ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో అనేది కంపెనీ ఇంకా చెప్పలేదు.ఇక స్కోడా కుషాక్ ఎస్‌యూవీ కార్ ని బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఇక కస్టమర్లు కంపెనీ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కార్ ని బుక్ చేసుకోవచ్చు.ఇక స్కోడా తన కుషాక్ ఎస్‌యూవీ కార్ ని మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. అవి యాక్టివ్, అంబిషన్ ఇంకా స్టైల్ వేరియంట్లు. కుషాక్ రెండు టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. ఇక ఇందులో ఒకటి వచ్చేసి 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి వచ్చేసి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: