ఇక ఆటోమొబైల్‌ రంగంలో మహీంద్రా కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకు ఇటీవల మహీంద్రా ఎక్స్‌యువి 700 రికార్డు బుకింగ్స్‌ అనేవి నిదర్శనం. తాజాగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా దూసుకెళ్లాలని సన్నాహాలు చేస్తోంది.ఈ క్రమంలో సరికొత్త ఎలక్ట్రిక్‌ కార్లను కూడా తీసుకురాబోతుంది. అందులో భాగంగానే మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడల్‌ని విడుదల చేసింది. అయితే ఇక ఈ కారు విడుదలకు ముందే, మహీంద్రా వీలు దొరికినప్పుడల్లా టీజర్‌లతో ఈ కారుపై మంచి హైప్‌ను పెంచుతోంది.ప్రత్యేకంగా చెప్పాలంటే, ఈ భారతీయ వాహన తయారీ సంస్థ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను (SUV) విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ కార్లని ప్రతాప్ బోస్ నేతృత్వంలోని మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (M.A.D.E) రూపొందించిందని గమనించాలి.


ఇక కంపెనీ దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్‌ల ప్రకారం, SUVలకు XUV-e1, SUV-e2, SUV-e3, SUV-e5, SUV-e6, SUV-e7, SUV-e8 ఇంకా SUV-e9 అని పేరు పెట్టే అవకాశం ఉంది. ఇక ట్రేడ్‌మార్క్ చేసిన పేర్లలో 4వ సంఖ్యతో ఉన్న పేరు సిరీస్‌లో లేకుండా పోయింది. ఈ మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ SUVల ఫీచర్లు ఇంకా ఇంటీరియర్‌ల గురించి ఈ టీజర్‌ ద్వారా కస్టమర్లకు క్లూ ఇచ్చింది.అలాగే ఇందులో కస్టమర్‌ ప్రాధాన్యతలకు సరిపడా రిక్లైనింగ్ సీట్లు ఉన్నాయి. అలాగే ఎయిర్ కండిషనింగ్ కోసం వ్యక్తిగత వినియోగదారు సెట్టింగ్‌లు ప్రతి ప్రయాణీకుడు సౌకర్యవంతంగా ఉండేలా కూడా చూస్తాయి.ఇంకా స్పష్టమైన కనెక్టివిటీ ఫీచర్‌ల కారణంగా కస్టమర్లు.. కాల్స్‌, టెక్స్ట్‌లు, మ్యూజిక్‌ ఇంకా టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను యాక్సెస్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో లెదర్ సీట్లు ఇంకా పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.ఇక ఖచ్చితంగా ఇవి వాహనదారులను ఎంత గానో ఆకట్టుకుంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: