దుబ్బాక ఉప ఎన్నికల్లో బి‌జే‌పి ఘన విజయం సాధించడంతో తెలంగాణలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.అంతే కాకుండా గ్రేటర్ ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు వుండడంతో అన్నిపార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నేతలు.. పార్టీలు మారుతున్నారు..

ఈ నేపథ్యలోనే ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు..రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు కొప్పుల నర్సింహారెడ్డి బీజేపీ గూటికి చేరారు. కొప్పుల నర్సింహారెడ్డిని కండువా కప్పి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీలోకి ఆహ్వానించారు..

అయితే కొప్పుల వున్నపళంగా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో రేవంత్ వర్గం షాక్ గురైంది. మొన్నటి దాకా రేవంత్ రెడ్డికి కుడి భుజంగా ఉంటూ...అన్నీ తానై నియజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని నడిపారు కొప్పుల నర్సింహారెడ్డి ఒక్కసారిగా పార్టీ మారి బి‌జే‌పి తీర్థం పుచ్చుకోవడంతో రేవంత్ రెడ్డి వర్గం పలు అనుమానాలను లేవనేత్తింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: