2020 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను ప్రకటించారు. కాగా సౌత్ నుండి తెలుగులో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలో హీరోగా నటించిన నవీన్ పోలిశెట్టి ఉత్తమనటుడిగా ఈ అవార్డు అందుకున్నారు. ఇక సౌత్ నుండి ఉత్తమ నటిగా రష్మిక మందన ఈ అవార్డును సొంతం చేసుకుంది. డియర్ కామ్రేడ్ సినిమాకు రష్మిక కు ఈ అవార్డు వచ్చింది. అంతేకాకుండా ఉత్తమ డైరెక్టర్ గా యువ డైరెక్టర్ సుజిత్ అవార్డును కైవసం చేసుకున్నారు. సహో చిత్రానికి గాను సుజిత్ కు ఈ అవార్డు దక్కింది.

మరోవైపు ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న సంగీత దర్శకుడు తమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కించుకున్నారు. అంతేకాకుండా మోస్ట్ వర్సటైల్ యాక్టర్ గా అక్కినేని నాగార్జున దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా సినీ రంగంలో అత్యున్నత ప్రతిభ చూపిన వారికి ఈ అవార్డులను అందిస్తారు. ఈ అవార్డులను 17 వ జాతీయ చలనచిత్ర అవార్డుల సమయం నుండి బహుకరిస్తారు. 1969లో  తొలిసారిగా ఈ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభమయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: