మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీకి రెడీగా ఉన్నారు. కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న "ఆచార్య" పూర్తి చేసిన తర్వాత తదుపరి సినిమాను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు "చిరు 153" సినిమా హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. మలయాళం బ్లాక్ బస్టర్ "లూసిఫర్" చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అవుతుంది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం సినిమాకు "గాడ్ ఫాదర్" అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక వివరాలు ఈ రోజు వెల్లడించే అవకాశం ఉంది. రాజకీయ నేపథ్యంలో మూవీ స్టోరీ సాగుతుంది. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసి మరో రీమేక్ సినిమాలపై దృష్టి పెట్టనున్నారు చిరు. "చిరు 154"గా తమిళ్ మూవీ "వేదాలం" నిర్మితం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: