గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పై బీఆర్‌ఎస్‌  ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ  జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ సభకు లేని కరోనా నిబంధనలు గణతంత్ర దినోత్సవాలకి వచ్చిందా అని బీజేపీ  జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఓనమాల తెలియని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కూడా గవర్నర్ పై నోటికి వచ్చిన కూతలు కూయడం ఆ పార్టీ నాయకుల అహంకారానికి నిదర్శనమని బీజేపీ  జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిప్పులు చెరిగారు.


గణతంత్ర వేడుకలు జరపని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని బీజేపీ  జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  ధ్వజమెత్తారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఅర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తెలంగాణ ప్రభుత్వానికి వర్తించేలా లేదని, భారత దేశంలో తెలంగాణ రాష్ట్రం అంతర్భాగం కానట్లు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీజేపీ  జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. మహిళ అని కూడా గౌరవం లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడిన ఎమ్మెల్సీను వెంటనే బర్తరఫ్ చేయాలని బీజేపీ  జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: