కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాలకు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా పొలాల్లో పని చేసే రైతులు వ్యవసాయ కూలీలు కాపరులు ఎంతో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ.
వ్యవసాయ కూలీలు కాని కాపరులు కానీ ఎవరూ చెట్ల కింద ఉండవద్దని సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాలకు లోని పలు ప్రాంతాలు భారీ మొత్తంలో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.