మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ సర్కార్ ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన జరుగుతుంది అని  ఆయన అన్నారు. ప్రజలను దోచుకు తింటుంటే, ఆహా ఓహో నా పార్టీ అంటూ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది  అని ఆయన ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో మైనింగ్ దోపిడీ చేస్తుంటే అధికారులు సహకరిస్తున్నారు అని మండిపడ్డారు. రాష్ట్రంలో, మద్యం విద్యుత్ చార్జీలు రోడ్ టాక్స్ లు పెంచి దోపిడీ చేయడం లేదా అని నిలదీసారు.

ఆయిల్, కంది పప్పు, మినప్పప్పు నిత్యవసర ధరల పెంచారు అని మండిపడ్డారు. మీ ప్రభుత్వాలు నాటుసారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ గా మారిపోయింది అని విమర్శించారు. స్విచ్ ఆపరేటర్లు , ఏఎన్ఎం, ఆశావర్కర్లు పోస్టులను అమ్ముకుంటున్నారు అని అన్నారు.  ఆధారాలతో సహా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం అని అన్నారు. ఎమ్మెల్యేలు  ఇన్ని దోపిడీలు చేస్తూ  తిరిగి మమ్మల్ని విమర్శిస్తున్నారు అని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: