మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజు మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. విజయసాయి రెడ్డి... కొన్ని రోజుల నుంచి అశోక్ ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల ఈవో విషయంలో హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేయగా దీనిపై హైకోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. ట్రస్ట్ చైర్మన్ మాట వినాల్సిందే అని స్పష్టం చేసింది.

తాజాగా విజయసాయి దీనిపై ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. మాన్సాస్‌లో ఆడిట్ జరగొద్దు, ట్రస్టు బోర్డు ఉండొద్దంటూ పిటిషన్ వేశావంటే నువ్వెంత పారదర్శకంగా పనిచేస్తున్నావో అర్థమవుతోంది అశోకు అంటూ ఎద్దేవా చేసారు. అక్రమాలకు పాల్పడకపోతే ఆడిట్ అంటే ఉలుకెందుకు అశోక్? అని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అన్నారు. వారికి జవాబుదారీగా ఉండాలి అని  'అంతా నా ఇష్టమనడానికిది రాజరికం కాదు రాజా'అని ఆయన అని పోస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: