ఒక్క రోజులోనే మాట మార్చిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి పరువు పోగొట్టుకున్నారు. రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేసిన జగ్గారెడ్డి.. మొన్న సంచలన ప్రకటన చేస్తానని ప్రకటించారు. ఆయన ప్రకటన ఏమై ఉంటుందా అని అంతా ఎదురు చూశారు. కానీ.. అబ్బే.. అదేం లేదని వెనక్కి తగ్గారు జగ్గారెడ్డి.. నేను ఏం మాట్లాడినా పార్టీ మంచి కోసమే మాట్లాడతానని.. పార్టీ లైన్‌లోనే ఉంటా.. నేను ఎక్కడికీ పోనని జగ్గారెడ్డి అన్నారు.

" నేను పోవాలి అనుకుంటే నన్ను ఆపేదెవరు?.. త్వరలోనే మళ్లీ అన్ని విషయాలు మాట్లాడతా.. ఎవరికీ భయపడను.. నేను అనుకున్నదే మాట్లాడతా.. తెలంగాణ ఉద్యమం వేళ సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం కట్టుబడి ఉన్నా.. నాపై మా పార్టీ నేతలు, బయటివారు ఒత్తిడి తెచ్చారు.. అప్పుడే ఒత్తిళ్లకు లొంగలేదు.. ఇప్పుడు లొంగుతానా.. పార్టీ కోసం కలిసి పనిచేస్తా అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు జగ్గారెడ్డి. మొత్తం మీద ఉట్టుట్టి ప్రకటనలతో పరువు తీసుకున్నారు జగ్గారెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: