వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర లోని నాగ్పూర్ జిల్లా లో దారుణం వెలుగు చూసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వైద్యురాలి పై ఐటీ కమిషనర్ పలుమార్లు లైంగిక దాడి చేశాడు. పెళ్లి ప్రస్తావన తేవడం తో ఆమె అశ్లీల ఫొటోలు సోషల్ మీడియాలో పెడతారని బెదిరించాడు. పుదుచ్చేరికి చెందిన నివాసి నేషనల్ అకాడమీ ఆఫ్ డెరెక్ట్ ట్యాక్సెస్ లో శిక్షణ నిమిత్తం 2019లో నాగ్పూర్ వెళ్లాడు. ఈ క్రమంలో నాగ్పూర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స నిమిత్తం వెళ్లగా అక్కడ పనిచేసే వైద్యురాలి తో ఆయనకు పరిచయం ఏర్పడింది.
అలా మొదలైన వారి పరిచయం కాస్త శారీరక సంబంధం గా మారింది.. దీంతో ఆమె పై చాలా సార్లు అతను లైంగిక దాడి చేశారు.ఈ క్రమం లో ఆమె గర్భవతి అయ్యింది.బాధితురాలు పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడం తో ఆమె అశ్లీల ఫొటోలను సోషల్ మీడియా లో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్ 376 కింద నిందితుడి పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు బెంగళూర్ లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని, విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.. ఇలాంటివి జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు..