అయితే రోజూలానే రెండేళ్ల కూతురు ఆద్యకు స్నానం చేయించేందుకు రెడీ అయ్యింది ఆ తల్లి. కాగా.. చలికాలం కావడంతో చన్నీళ్లతో స్నానం చేయిస్తే పాప చలికి తట్టుకోలేదని భావించి వేడినీళ్లు తీసుకొచ్చి బాత్రూమ్లో పెట్టి వెళ్ళింది. కొన్ని చల్లటి నీళ్లు తీసుకోవడానికి వెళ్లిన తల్లి వచ్చే లోపే ఇంట్లోనే ఆడుకుంటున్న పాప అవి వేడి నీళ్లని, ముట్టుకుంటే కాలుతుందని తెలియక బకెట్లో చేయి పెట్టేసింది. ఆ చిన్నారి చేతి కాలడంతో బాధ తట్టుకోలేక చేయి తీసే నేపథ్యంలోనే బకెట్ ప్రమాదవశాత్తూ పాపపై పడిపోయింది. ఇక బకెట్లో నీళ్లు వేడివేడిగా ఉండటంతో పాప శరీరం కాలిపోయింది.
ఇక ఆ బాధను తట్టుకోలేక పాప పెద్దగా ఏడుస్తూ ఉండటంతో ఏమైందా అని తల్లి చన్నీళ్లు తీసుకుని వచ్చిసరికి కాలిన గాయాలతో పాప విలపించడాన్ని చూసి కన్న తల్లి గట్టిగా కేకలేసింది. తల్లి కేకలు విన్న చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ చిన్నారి ఆ బాధ తట్టుకోలేక గుక్క పట్టి ఏడుస్తూనే ఉండటంతో మైసూరులోని కేఆర్ హాస్పిటల్కు పాపను చికిత్స నిమిత్తం హుటాహుటిన తరలించినప్పటికీ పాప శరీరం బాగా కాలిపోవడంతో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఇక చిన్నారి మరణంతో రాము, అతని భార్య జయలక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.