అయితే దాదాపుగా అన్ని రకాల ఫిర్యాదులు పోలీసులు తమ కెరియర్లో అందుకుని ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ప్రజలు ఇచ్చే చిత్రవిచిత్రమైన ఫిర్యాదులు మాత్రం పోలీసులు షాక్కి గురి చేస్తూ ఉంటాయి. ఏదైనా పెద్ద నేరం జరిగినప్పుడు వెంటనే పోలీసులను ఆశ్రయించిన వారిని చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఊహించని ఫిర్యాదు చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఇంతకీ అతను దేనిగురించి కేసు పెట్టాడు అనే కదా మీ డౌట్.. ఏకంగా ఒక మర్డర్ జరిగిపోయింది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓరి నాయనో మర్డర్ జరిగిన తర్వాత అది చిన్న కేసు ఎలా అవుతుంది అనుకుంటున్నారు కదా.
అయితే ఇక్కడ జరిగింది మనుషులు మనుషులను చంపిన ఘటన కాదు. ఏకంగా ఒక కోడి చనిపోయిన ఘటన. తన కోడిని ఎవరో విషం పెట్టి చంపారు అంటూ ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హిమాచల్ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలి అంటూ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాదు కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి బోరున విలపించాడు. దీంతో ఆ వ్యక్తిని చూసేందుకు చుట్టుపక్కల ఉన్న జనం మొత్తం ఒక్కసారిగా గుమిగూడారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడు అన్న విషయాన్ని నిర్ధారించారు. అయితే ఇలా కలెక్టర్ ఆఫీస్ కి వచ్చిన వ్యక్తి బీహార్కు చెందిన రాజేష్ రాయ్ గా గుర్తించారు పోలీసులు..