ఒకవైపు సరిహద్దుల్లో శత్రు దేశాల నుంచి భారత్ ను కాపాడేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తూ ప్రాణాలకు తెగించి మరీ సైనికులు పహారా కాస్తూ ఉంటారు. మరోవైపు దేశ నడిబొడ్డులో శాంతిభద్రతల నెలకొనేలా పోలీసులు ఎప్పుడు ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రజలకు ఏదైనా ఆపద వచ్చింది అంటే చాలు క్షణాల్లో వ్యవధిలో వారి దగ్గర వాలిపోయి వారి సమస్యలు పరిష్కరిస్తుంటారు. అదే సమయంలో అటు ప్రజలు కూడా తమకు ఏదైనా సమస్య వస్తే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు పోలీసులు ఎన్నో రకాల ఫిర్యాదులు అందుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 అయితే దాదాపుగా అన్ని రకాల ఫిర్యాదులు పోలీసులు తమ కెరియర్లో అందుకుని ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ప్రజలు ఇచ్చే చిత్రవిచిత్రమైన ఫిర్యాదులు మాత్రం పోలీసులు షాక్కి గురి చేస్తూ ఉంటాయి. ఏదైనా పెద్ద నేరం జరిగినప్పుడు వెంటనే పోలీసులను ఆశ్రయించిన వారిని చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఊహించని ఫిర్యాదు చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఇంతకీ అతను దేనిగురించి కేసు పెట్టాడు అనే కదా మీ డౌట్.. ఏకంగా ఒక మర్డర్  జరిగిపోయింది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓరి నాయనో మర్డర్ జరిగిన తర్వాత అది చిన్న కేసు ఎలా అవుతుంది అనుకుంటున్నారు కదా.



 అయితే ఇక్కడ జరిగింది మనుషులు మనుషులను చంపిన ఘటన కాదు. ఏకంగా ఒక కోడి చనిపోయిన ఘటన. తన కోడిని ఎవరో విషం పెట్టి చంపారు అంటూ ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హిమాచల్ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలి అంటూ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాదు కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి బోరున విలపించాడు. దీంతో ఆ వ్యక్తిని చూసేందుకు చుట్టుపక్కల ఉన్న జనం మొత్తం ఒక్కసారిగా గుమిగూడారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడు అన్న విషయాన్ని నిర్ధారించారు. అయితే ఇలా కలెక్టర్ ఆఫీస్ కి వచ్చిన వ్యక్తి బీహార్కు చెందిన రాజేష్ రాయ్ గా గుర్తించారు పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి: