ఇటీవలి కాలంలో ఎంతోమంది ప్రేమించి కులాంతర మతాంతర వివాహం చేసుకుంటూ ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. కొంతమంది విషయంలో మాత్రం కులం మతం కారణంగానే ఇక ప్రేమ దూరమవ్వడం మనస్తాపంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నా ఘటనలు జరుగుతూనే ఉన్నాయని చెప్పాలి. ఏకంగా ప్రేమించేటప్పుడు కుల మతాలను కూడా పట్టించుకోని  ఎంతోమంది ఇక పెళ్లి సమయంలో మాత్రం చివరికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని ముఖం చాటేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఆ యువతి ఓ యువకుడిని ప్రేమించింది.


 ఇక ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ వారి కుల మతాలు వేరు అన్న విషయం అప్పుడే ఆ యువకుడికి గుర్తుకు వచ్చింది. దీంతో ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోవడం లేదు అంటూ చెప్పాడు. కానీ ఆ తర్వాత యువతి ఒత్తిడితో పెళ్లి చేసుకున్నాడు. కానీ చివరికి ఇక భార్యను పుట్టింట్లోనే వదిలేసి పట్టించుకోవడం మానేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ నగరంలోని నాంపల్లి రెడ్ హిల్స్ లో ఘటన చోటుచేసుకుంది. మూసాపేట్ కు చెందిన యువకుడితో జంగం బస్తీలో ఉండే యువతికి పరిచయం ఏర్పడింది.


 ఇక పరిచయం కాస్త ప్రేమగా మారి పోయింది. సదరు యువతి ప్రైవేట్ ఆస్పత్రిలో పిఆర్ఓ గా పనిచేస్తుంది. అయితే పెళ్లి విషయం యువకుడి దగ్గరికి తీసుకు వచ్చే సరికి ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అయితే యువకుడు తమ మతానికి చెందిన  మరో యువతితో గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకున్నాడు. ప్రేమికులు మళ్లీ కలుసుకున్నారు. అయితే ఇక తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టడంతో ఇక యువత తల్లి గుట్టుచప్పుడు కాకుండా ఇద్దరికీ పెళ్లి చేసింది. పెద్దలు ఒప్పుకోక పోవడంతో ఇక రాజ్ భవన్ సమీపంలో ఇంట్లో అద్దెకు కాపురం పెట్టారు. ఇటీవల యువతి అనారోగ్యానికి గురికావడంతో పుట్టింట్లో వదిలేసి వెళ్లాడు. కానీ మళ్లీ తీసుకువెళ్లడానికి రాలేదు. అయితే ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండకూడదని తల్లిదండ్రులు మందలించారు. కట్టుకున్నవాడు ఇంటికి తీసుకెళ్లే సాహసం చేయకపోవడంతో మోసపోయానని గ్రహించి చివరకు ఆత్మహత్య చేసుకుంది యువతి.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: