అమ్మాయిలు, అబ్బాయిలకు వరుస షాక్ లు ఇస్తున్నారు..ఇష్టం లేని పెళ్ళి ,లేదా మరెయితర కారణాల వల్ల కానీ అమ్మాయిలు అబ్బాయిలను వదిలేసి వెళ్ళి పోతున్నారు.తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.తెల్లారితే పెళ్లి పీటల మీదకు ఎక్కాల్సిన యువతి మెడకు ఉరితాడు బిగించుకుంది. ప్రేమించిన వ్యక్తితో కాకుండా మరొకరితో పెళ్ళి కుదుర్చడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది..ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జాజులకుంటకు చెందిన యువతి (24) డిగ్రి చదివి ఇంటివద్దే ఉంటోంది. ఈమె కొంతకాలంగా ఓ వ్యక్తికి ప్రేమిస్తోంది.


కుటుంబ సభ్యులు జంగారెడ్డి గూడెం లక్కవరానికి చెందిన మరొకరితో వివాహం కుదిర్చారు. బుధవారం పెళ్లి జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. యువతి మంగళవారం రాత్రి చీర మార్చుకుంటానని గది లోకి వెళ్లి తలుపులేసుకుని ఉరేసుకుంది. ఆమె ఎంత సేపటికీ రాకపోయేసరికి కుటుంబ సభ్యులు తలుపులు గడి పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. దీని మీద తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.



ఇదిలా ఉండగా, మే 26వ తేదీన ఇలాంటి ఘటనే కర్ణాటక లో జరిగింది. తెల్లారితే పెళ్లి.. కుటుంబ సభ్యులు, బంధువులతో ఇల్లంతా కళకళలాడుతోంది. పెళ్లి తో కొత్త జీవితాన్ని ఊహించుకుంటున్న వరుడికి.. ఇంటి సభ్యులకు వధువు ఊహించని షాక్ ఇచ్చింది. రాత్రి కి రాత్రే తన ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపొయింది. తన ప్రియుడు, మేనమామ అయిన ప్రవీణ్ తో గుట్టు చప్పుడు కాకుండా పరారైంది. ఉదయం లేచి చూసేసరికి వధువు లేకపోవడం తో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ విషయం ముందే చెప్పి ఉంటే మేనమామ తోనే పెళ్లి చేసే వాళ్ళమ ని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పెళ్ళికొడుకు సైతం తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఏంటో ఈ కాలం అమ్మాయిలు..


మరింత సమాచారం తెలుసుకోండి: