మనిషి శరీరంలో అత్యంత సున్నితమైన శరీర భాగం ఏది అంటే అది కన్ను అని చెబుతూ ఉంటారు. అందుకనేమో ఎంత బలవంతులు అయినా సరే కంట్లో చిన్న నలకపడింది అంటే చాలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక కంటికి దెబ్బ తాకింది అంటే చాలు నొప్పితో విలవిలలాడిపోతూ ఉంటారు. అయితే సాధారణంగా కంటిలో నలుసు పడితేనే కొన్ని కొన్ని సార్లు ప్రాణం పోతుందేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది.


 అందుకే ఎంతోమంది ఇక కంట్లో ఎలాంటి దుమ్ము ధూళి పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఎవరు ఊహించని ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా ఒక చిన్నారి కంటి నుంచి ఏకంగా రాళ్లు బియ్యం గింజలు బయట పడుతూ ఉండడం స్థానికులు అందరినీ కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. అయితే గతంలో కూడా ఇలా చాలామంది కళ్ళల్లో నుంచి రాళ్లు రావడం జరిగింది. దీనితో ఇలా రాలు రావడం సాధారణమే అయినప్పటికీ ఇక్కడ మాత్రం ఒక చిన్నారి కళ్లలో నుంచి ఏకంగా బియ్యపు గింజలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు లో వెలుగు చూసింది.


 రంగన్న, లక్ష్మీ దంపతులకు కూతురు దీపాలి ఉంది. అయితే రెండు రోజుల నుంచి కంటినొప్పితో తీవ్ర అవస్థ పడుతుంది ఆ చిన్నారి. తీరా ఏం జరిగిందో అని చూస్తే కళ్ళలో నుంచి చిన్న చిన్న రాళ్లు బియ్యం గింజలు బయటకు వస్తూ కనిపించాయి. ఇక తల్లిదండ్రులు వాటిని బయటకు తీసిన మళ్లీ కేవలం నిమిషాల వ్యవధిలో కొత్తగా బియ్యపు గింజలు కంటి నుంచి బయట వస్తూ ఉండటం చూసి అందరూ షాక్ అయ్యారు. వైద్యులు స్కానింగ్ పరీక్షలు చేసిన ఏమీ లేదని తేల్చి చెప్పారు అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఏకంగా దీపాలి కంటి నుంచి 12 బియ్యపు గింజలు బయటకు వచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటన స్థానికులు అందరినీ అవ్వక్కయ్యేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: