ఇటీవల కాలంలో మద్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రతిరోజు ఆహారం తీసుకోవడం ఎలా అయితే తప్పనిసరి అనుకుంటున్నారో ఇక మద్యం తాగడం కూడా అంతే తప్పనిసరి అని ఎంతో మంది భావిస్తూ ఉన్నారు. దీంతో ఎక్కడ చూసినా వైన్ షాపులు జనాలతో నిండిపోతున్నాయి తప్ప ఖాళీగా మాత్రం కనిపించడం లేదు. అయితే మద్యం ధరలు అంతకంతకు పెరిగిపోతున్న కూడా మందుబాబుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఎవరికో సహాయం చేసి లేదా సేవా కార్యక్రమాలు చేసి కాస్త పుణ్యం మూట గట్టుకోవడం కన్నా ఇక మందు తాగి మత్తులో తూగడానికే ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు.



 అయితే చాలామంది కేవలం అవసరాన్ని బట్టి మాత్రమే మద్యం తీసుకుంటూ ఉంటే.. ఇంకొంతమంది మాత్రం ఇక మద్యం తాగడం కోసమే పుట్టారేమో అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ప్రతిరోజు మద్యం తాగుతూ చివరికి సొంత వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా ఫుల్లుగా మద్యం తాగి మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్న వారు చాలామంది కనిపిస్తున్నారు. ఇక్కడ ఒక కసాయి భర్త అయితే మరింత దారుణానికి పాల్పడ్డాడు. మద్యం తాగొద్దు ఆరోగ్యం పాడవుతుంది కుటుంబ బాధ్యతలు చూసుకో అని మంచి చెప్పిన భార్యని దారుణంగా హత్య చేశాడు భర్త.



 ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో వెలుగులోకి వచ్చింది. భర్తను మద్యం తాగొద్దు అని మంచి మాటలు చెప్పడమే ఆ భార్య పాలిట శాపంగా మారిపోయింది. ఇక భార్య మద్యం తాగొద్దు అన్నందుకు కోపంతో నిద్రపోతున్న భార్యను కరెంట్ షాక్ పెట్టి చంపేశాడు భర్త. తన భార్య కరెంట్ షాక్ తో చనిపోయిందని పోలీసులకు చెప్పి నాటకం ఆడాడు. అయితే పోలీసులు అతని అదుపులోకి తీసుకొని గట్టిగా విచారించడంతో నిజం ఒప్పుకున్నాడు. అయితే యాదయ్య మద్యానికి బానిస కావడంతోనే భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్లిందని.. కానీ పెద్దమనుషులు సర్ది చెప్పి మళ్ళీ అత్తారింటికి పంపించారని. వీరిద్దరిది లవ్ మ్యారేజ్ అని పోలీసు విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: