ప్రభుత్వాలు ఎన్ని కొత్త చర్యలు తీసుకుంటున్నా కూడా ఆడవాళ్ళ పై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు నేరగాళ్ల ను అనేక హింసలకు గురి చేస్తున్నా కూడా వారి ప్రవర్తనలో మాత్రం మార్పు లేదు..ఏదో రకంగా హింసలకు గురి చేస్తున్నారు. ఇప్పుడు కూడా మరో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ యువతి ఆత్మహత్య చేసుకోని చనిపొయింది.. ఈ విషయం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.. ఆమె మరణం అనేక అనుమానాలకు దారి తీస్తుంది..


ఈ విషయం కాస్త సీరియస్ అవ్వడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి.. మహిళ గర్భాశయం ప్రాంతంలో స్పెర్మ్ కణాలు ఉన్నట్లు శవపరీక్ష నివేదిక లో తేలింది. దీంతో వెంటనే రంగం లోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదర లో జరిగింది. వివరాల్లొకి వెళితే.. ఫుడ్ డెలివరీ కంపెనీలో వారి సహోద్యోగి అయిన బాధితురాలిని జూన్ 8 న ఒక ప్రైవేట్ పార్టీలో మద్యం సేవించమని బలవంతం చేశారని, ఆపై వారిలో ఒకరు ఆమెపై అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. జూన్ 10 ఉదయం తన ఇంట్లో యువతి ఉరి వేసుకుని మరణించింది. ఈ మేరకు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు.. మృత దేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు.. ఫోరెన్సిక్ పరీక్ష చేయాలని నిపుణులను కోరారు. పోస్టుమార్టం చేసిన టీమ్ ఆమె గర్భాశయ ప్రదేశంలో స్పెర్మ్ కణాల ఉనికిని గుర్తించింది. ఆ తరువాత,  లైంగిక వేధింపుల కోణం నుండి కేసును విచారించారు. ఆ తర్వాత నిందితుల గురించి తెలిసింది అని కేసును విచారిస్తున్న ఇన్స్పెక్టర్ తెలిపారు.. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: