మనం సాధారణంగా సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము ఏకంగా పోలీస్ స్టేషన్ల ముందు న్యాయస్థానం ముందు శత్రువులపై కొంతమంది దుండగులు దాడులు చేస్తూ ఉంటారు. ఏకంగా ప్రాణాలను సైతం తీసేస్తూ ఉంటారు. సినిమాల్లో అయితే ఓకే గాని నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు  జరగవు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ల ముందు న్యాయస్థానం ముందు ఎటాక్ చేయాలంటే దుండగులు భయపడతారు అని అందరూ అనుకుంటారు . కానీ ఇటీవల కాలంలో దుండగులకు పోలీసులు అంటే ఏమాత్రం లెక్క లేకుండా పోయింది అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు పోలీసులు పక్కనే ఉన్న పట్టించుకోకుండా హత్యలకు పాల్పడడం లాంటి ఘటనలు కూడా ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్నాయి.


 ఇక చంపాల్సిన టార్గెట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎంత మంది లో ఉన్న ఎవరు పక్కన ఉన్న పట్టించుకోకుండా చివరికి హత్య చేసి మెల్లగా అక్కడి నుంచి జారుకోవడం లాంటివి నేటి రోజుల్లో ఎంతో మంది క్రిమినల్ చేస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. పంజాబ్లోని మోగా జిల్లాలో కోర్టు ఆవరణలో షాకింగ్ ఘటన జరిగింది. కొందరు వ్యక్తులు సన్ని అనే వ్యక్తిని టార్గెట్ చేసుకున్నారు. ఎలాగైనా అతన్ని హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే మోగాలోని కోర్టు ఆవరణలో సన్నీ ఉన్నట్లు తెలుసుకుని వెంటనే అతనిని ఫాలో అయ్యారు.


 కోర్టు ఆవరణ.. అక్కడ పోలీసులు ఉంటారు అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా అతనిపై కాల్పులు జరిపారు. కానీ అదృష్టవశాత్తు అతను మాత్రం త్రుటిలో  తప్పించుకున్నాడు అనే చెప్పాలి. ఇక ఈ ఛేజ్ ఏకంగా సినిమా కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే ఉంది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితేఇక ఈ ఘటన తర్వాత అదే కోర్టు ఆవరణలో ఉన్న పోలీసులు సైతం ఒక్కసారిగా షాకయ్యారు. పోలీసులు ఉన్నచోటే ఇలాంటి ఘటనలు జరిగితే ఇక పోలీసులు లేని చోట ఎలాంటి ఘటనలు జరుగుతాయో అని కొంతమంది భయాందోళన చెందుతున్నారు అని చెప్పాలి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: