కానీ చివరికి కోతులు చేసిన పనికి అల్లరి ముద్దుగా పంచుకున్న పిల్లల ప్రాణాలు పోతాయని మాత్రం ఊహించలేకపోయారు. నిజాంబాద్ జిల్లాలో కోతుల గుంపు కారణంగా పిల్లల ప్రాణాలు పోయిన ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది. కాగా నలుగురు స్నేహితుల్లో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరిని స్థానికులు కాపాడగలిగారు అని చెప్పాలి. నిజాంబాద్ జిల్లా మాట్లూరు మండలం మామిడిపల్లి గ్రామంలో 12 ఏళ్ల అఖిల్, 13 ఏళ్ల వయసు ఉన్న రాజేష్, అభిలాష్, హనుమంతులు నలుగురు కాల కృత్యాలు తీర్చుకొని స్నానం చేయడానికి చెరువుగట్టుకు వెళ్లారు.
అక్కడే ఉన్న కోతుల గుంపు వీరిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో భయంతో ఈ నలుగురు బాలురు కూడా పరుగులు పెట్టారు. కోతుల గుంపు వెంట పడడంతో నలుగురు ఎటు వెళ్లాలని తెలియక చెరువులో పడిపోయారు. అయితే దూరం నుంచి గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని కోతులను తరిమి వేశారు... ఈ క్రమంలోనే హనుమంత్ అభిలాష్ ను కాపాడారు. అయితే మిగతా ఇద్దరు నీటిలో మునిగి చనిపోయారు. సుమారు రెండు గంటల పాటు చెరువులో గాలించి వారి మృతదేహాలను బయటకు తీశారు. ఇక పండగ పూట కొడుకుల మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన తల్లిదండ్రులు విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.