ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై సమీక్ష చేశారు. కొన్ని శాఖలు, జిల్లాల్లో కేంద్రం నుంచి వచ్చిన నిధులు పూర్తిగా ఖర్చు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం రూ.30 వేల కోట్ల లక్ష్యంతో ఉన్న సీఎస్ఎస్ పథకాల కింద ఇంకా రూ.6,252 కోట్లు ఖర్చు కాలేదని పేర్కొన్నారు. ఈ నిధులను జనవరి 15లోగా పూర్తిగా ఖర్చు చేయాలని ఆదేశించారు.

జనవరిలోగా 75 శాతం ఖర్చు చేస్తే కేంద్రం నుంచి అదనపు నిధులు సులభంగా రప్పించవచ్చని సూచించారు. పీఎం ఆవాస్ యోజన అర్బన్‌లో కేవలం 38 శాతమే ఖర్చు అయినందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజిలెన్స్ విచారణల వల్ల ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలకు వెసులుబాటు కల్పించాలని ఆదేశించారు. ఈ చర్యతో మరిన్ని ఇళ్లు పూర్తి చేసే అవకాశం ఉంటుందని అన్నారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమగ్ర శిక్షా పథకం కింద రూ.1,363 కోట్లలో రూ.1,259 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

పెండింగ్ నిధులను కూడా త్వరగా ఖర్చు పెడతామని హామీ ఇచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి రూ.1,200 కోట్ల అదనపు నిధులు అడిగామని పేర్కొన్నారు. పీఎంఏవై అర్బన్ నిధుల ఖర్చును పర్యవేక్షించాలని మంత్రి కొలుసు పార్థసారథికి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో సీఎస్ఎస్ పథకాల ద్వారా రూ.24,513 కోట్ల విలువైన పనులు పూర్తి చేయాల్సి ఉందని సీఎం గుర్తు చేశారు. ఈ నిధులు సమయానికి ఖర్చు కాకపోవడం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమవుతోందని అధికారులను హెచ్చరించారు.

ఈ సమీక్షలో చంద్రబాబు కేంద్ర నిధులను పూర్తిగా వినియోగించుకోవడం ద్వారా మరిన్ని నిధులు రప్పించవచ్చనే విధానాన్ని స్పష్టం చేశారు. గతంలో కొన్ని పథకాల్లో నిధులు మళ్లింపు జరిగినట్టు ఆరోపణల నేపథ్యంలో ఈసారి పారదర్శకత, వేగం పెంచాలని నొక్కి చెప్పారు. పీఎంఏవై అర్బన్ పథకం దేశవ్యాప్తంగా 76 శాతం పురోగతిలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ ఖర్చు ఆందోళన కలిగిస్తోంది.


 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: