భారత మార్కెట్ పసిడి ధర పైపైకి ఎగబాకింది. పరుగులు పెడుతూ దూసుకుపోతుంది. వెండి ధర కూడా పసిడి బాటలోనే పయనిస్తోంది.బంగారం ధర కొనుగోలు చేయాలని అనుకునే వారికి బ్యాడ్ న్యూస్. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పెరుగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్ లోనూ పసిడి ధర పైపైకి కదిలిందని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడించారు.

 

హైదరాబాద్ నగర మార్కెట్ లో కూడా పసిడి ధర పెరిగింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.130 పెరిగింది. దీంతో ధర రూ.51,370 కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.140 పెరగడంతో రూ.47,090 వద్ద ఆగింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరతో పాటు వెండి ధర కూడా పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి పరుగులు తీస్తుంటే.. వెండి పసిడి దారిలోనే నడిచింది. ప్రస్తుతం మార్కెట్ లో కేజీ వెండి ధర గరిష్టంగా రూ.2250 పెరగడంతో కేజీకి ధర రూ.55,400 కు చేరింది. 

 

మొదటి నుంచే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పెరుగుతూ వస్తుంది. గత కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ మార్కెట్ బంగారం రేటు పెరిగినా దేశీయ మార్కెట్ బంగారం ధర తగ్గింది. కానీ ఇప్పుడు బంగారం ధర ఔన్స్ కు 0.16 శాతం పెరిగింది. దీంతో పసిడి ధర ఔన్స్ కు 1846 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా వెండి గణనీయంగా పెరిగింది. వెండి ధర ఔన్స్ కు 6.67 శాతం పెరగడంతో 22.99 డాలర్లకు ఎగసింది.

 

 

భారత రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర పైపైకి ఎగిసింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 పెరుగుదలతో రూ.49,100కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.50 పెరగడంతో రూ.47,900కు చేరింది. అదే సమయంలో వెండి ధర కూడా గరిష్టంగా పెరుగుదల చూపింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2250 పెరుగుదలతో రూ.55,400కు చేరిందని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: