మూత్రపిండాల ద్వారా ఎక్కువగా ప్రోటీన్స్ బయటకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా కళ్లు వాపులు వస్తాయి. ఇలాంటి లక్షణాలను కనిపించగానే వెంటనే మీరు వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం. ఎలక్ట్రోసైట్ ఇన్ బ్యాలెన్స్ వల్ల మూత్రపిండాల పక్రియలో ఆటంకం కలుగుతుంది. రక్తంలో మినరల్స్, ప్రోటీన్స్ ను మూత్రపిండాలు సరైన స్థితిలో బ్యాలెన్స్ చేయలేకపోతే చర్మం పై దురద మొదలవుతుంది. దురద ఎక్కువగా ఉన్నప్పుడు క్రీములు, మందులను వాడడం కంటే వైద్యున్ని సంప్రదించడం మంచిది. శరీరంలో కనుక ఇటువంటి మార్పులను గ్రహించినట్టయితే మూత్రపిండాల వైఫల్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నట్టుగా భావించాలి. మూత్రపిండాల సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త వహించడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మూత్రపిండాలు ఫెయిల్ అయితే మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీని వల్ల మైకం,తల తిరగడం, ఏకాగ్రత కుదరకపోవడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. పక్కటెముకల కింది భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది అంటే మూత్రపిండాల్లో రాళ్లు అన్నాయని అర్థం.


మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటే అవి శరీరంలో ఎర్ర రక్తకణాలను పెంచే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆక్సిజన్ శరీరం అంతా సరఫరా అవుతుంది. ఒకవేళ ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉంటే అది అలసటకు, మెదడు సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.మూత్రం రంగు మారడం, కొన్ని సార్లు ముదురు రంగులో మారడం, అలాగే మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు మంటగా ఉండడం, తక్కువగా మూత్రవిసర్జనుకు వెళ్లడం లేదా ఎక్కువగా వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలన్నీ మూత్రపిండాల వైఫల్యాన్ని సూచిస్తాయి. అంతేకాకుండా మోకాళ్లు, కీళ్లు, ముఖంలో వాపు రావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. మూత్రపిండాల పనితీరు సరిగ్గా లేనప్పుడు, బలహీనంగా మారినప్పుడు ఎక్కువ మోతాదులో ఫ్లూయిడ్స్ శరీరం నుండి బయటకు వెళ్లిపోవడం వల్ల ఇలా కీళ్లల్లో వాపు వస్తుంది. ఇవి అన్నీ మూత్రపిండాల వైఫల్యాన్ని సూచిస్తాయి. అలాగే తరచూ శ్వాస అందకపోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే మూత్రపిండాల వైఫల్యానికి సంకేతంగా భావించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: