భాగ్యనగరం చారిత్రక కట్టడాలకు పెట్టింది పేరు. వందల ఏళ్ల నాటి చారిత్రక కట్టడాలు, పురాతన కట్టడాలు, వారసత్వ కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కట్టడాలు ఇప్పుడు కను మరుగయ్యే పరిస్థితికి చేరుకుంటున్నాయి.వందల ఏళ్ల చరిత్ర భాగ్యనగరం సొంతం.ఇప్పటికీ ఎన్నో పురాతన కట్టడాలు చెక్కు చెదర కుండా నిలిచి ఉన్నాయి.నిర్వహణ లోపాల కారణంగా, అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాల ధాటికి 116 ఏళ్ల మహబూబ్ మాన్షన్ కూలింది. గత ఏడాది వానలకు గోల్కొండ కోటగోడ కూలింది. పురాతన కట్టడాల పై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. నగరంలో ఇంకా ఎన్నో చారిత్రక కట్టడాలు  ఉన్నాయి. 2007లో 1486 చారిత్రక భవనాలను గుర్తించారు. అన్ని సర్వేలు చేసి వీటిలో కనీసం 800 భవనాలకు మెరుగులు దిద్దితే వారసత్వ గుర్తింపు వస్తుందని తెలిపింది. వాటిలో ఇప్పటికే 90% భవనాలు మరికొద్ది రోజుల్లో కూలేలా ఉన్నాయి.

దానికంటే ముందు 1981లో హుడా ఆధ్వర్యంలో ఏర్పాటయిన వారసత్వ పరిరక్షణ కమిటీ 160 నిర్మాణాలను వారసత్వ కట్టడాలు గా గుర్తించారు. 2017 లో హెరిటేజ్ తెలంగాణ పేరుతో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దాంతో పాత జాబితా రద్దయింది. నగర పరిధిలోని చారిత్రక కట్టడాల రక్షణ కోసం జీహెచ్ఎంసీ కమిషనర్  ను చైర్మన్ గా కమిటీ ఏర్పాటు చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అవి కార్యరూపం దాల్చక పోవడంతో చారిత్రక కట్టడాల ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో చారిత్రక కట్టడాలు శిథి లావస్థమై చరిత్రలోనే కలిసిపోతున్నాయి. వీటన్నింటి మీదా ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా దృష్టి పెట్టి వీటన్నింటికి పూర్వ వైభవం తీసుకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరు కుంటున్నారు. పూర్వ వైభవం తీసుకు వస్తే మరి ఇన్ని రోజులు భావి తరాలకు కూడా ఎంతోమందికి చరిత్రను పరి చయం చేసిన వాళ్లమవుతాం.

మరింత సమాచారం తెలుసుకోండి: