కీళ్ల వాతం సమస్యతో బాధపడే వారు చలికాలంలో చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చల్లటి వాతావరణం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయి.అందువల్ల నొప్పులు మరింత ఎక్కువవుతాయి.ముఖ్యంగా చేతివేళ్లల్లో, కాలి వేళ్లల్లో నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. చల్లటి వాతావరణం వల్ల కండరాలు బిగుసుకు పోతాయి. పైగా కీళ్లను కదిలించడం కూడా చాలా కష్టమవుతుంది.కీళ్ల వాతంతో బాధపడే వారు రోజంతా చాలా నీరసంగా కనిపిస్తారు.పైగా ఆ నొప్పుల కారణంగా శరీరాన్ని కదిలించలేకపోతారు. అయితే కీళ్లవాతంతో బాధపడే వారు చలికాలంలో కొన్ని జాగ్రత్తలని పాటించడం వల్ల చాలా ఈజీగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.కీళ్లవాతంతో బాధపడే వారు ఖచ్చితంగా ఎల్లప్పుడూ వెచ్చని దుస్తులను ధరించాలి. అందువల్ల కండరాలు బిగుసుకుపోకుండా ఉంటాయి. ఇంకా అలాగే చేతులకు, తలకు, చెవులకు టోపీలు, తొడుగులు ధరించాలి.


అలాగే శరీరాన్ని ఖచ్చితంగా చురుకుగా ఉంచుకోవాలి. దీని కోసం యోగా, ఈత కొట్టడం ఇంకా వ్యాయామాలు చేయడం వంటివి చేయాలి. అలాగే ఖచ్చితంగా వేడి నీటితో స్నానం చేయాలి. ఇంకా వేడి నీటితో కీళ్లపై కాపడం పెట్టుకుంటూ ఉండాలి. అలాగే అధిక బరరువు నొప్పులను చాలా తీవ్రతరం చేస్తుంది. కాబట్టి బరువు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అందువల్ల కీళ్లపై బరువు ఎక్కువగా పడకుండా ఉంటుంది. ఇంకా అలాగే కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలను తీసుకోవాలి.అలాగే క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను, తృణ ధాన్యాలను, డ్రై ఫ్రూట్స్ ను, పండ్లను ఇంకా కూరగాయలను తీసుకోవాలి. జంక్ ఫుడ్ ను కూడా తక్కువగా తీసుకోవాలి. ఇంకా అలాగే శరీరానికి తగినంత విశ్రాంతి ఉండేలా చూసుకోవాలి. విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరానికి నొప్పిని తట్టుకునే శక్తి కూడా వస్తుంది. ప్రతి రోజూ 7 నుండి 8 గంటల పాటు నిద్రపోయేలా చూసుకోవాలి. కీళ్లవాతంతో బాధపడే వారు ఈ విధంగా చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు ఎక్కువ కాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: