చాలామంది దీర్ఘకాళిక రోగాలైన మధు మేహం,గుండె జబ్బులు,అధిక బిపి వంటి వ్యాధులకు రోజు టాబ్లెట్లు వేసుకుంటూ ఉండాల్సిందే. అలాంటి వారు ఆ వ్యాధుల కోసం మందులు వేసుకున్న తర్వాత కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి.మందులు వేసుకున్న వెంటనే ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల మందులు పనిచేయకుండా వేస్ట్ అయిపోతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.అ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

కూల్ డ్రింక్స్..
షుగర్ బీపీ మందులు వేసుకున్న తర్వాత కూల్ డ్రింక్స్ మరి ఎనర్జీ డ్రీంక్స్ తీసుకో కూడదు.వాటిని తీసుకోవడం వల్ల మందులు తొందరగా కరిగిపోవు.దానితో మెడిసిన్ వేసుకున్న వేస్ట్ అవుతుంది.మరియు జీర్ణ క్రియ మెల్లగా జరిగేలా చేస్తాయి.దీనితో ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆల్కహాల్..
దీర్ఘకాలిక రోగాలకు మెడిసిన్ వేసుకున్న వెంటనే ఆల్కహాల్ తీసుకోకూడదు. దీని వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ముఖ్యంగా మధుమేహులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

పాలు..
కొంతమందికి మెడిసిన్ పాలతో కానీ,కాఫీ,టీలతో కానీ వేసుకోవడం అలవాటు ఉంటుంది.కానీ మెడిసిన్ ఎప్పుడూ కూడా పాల పదార్థాలతో పాటు వేసుకోకూడదు.దీనికి కారణం అందులోని యాంటీబయాటిక్స్ ప్రభావం తగ్గిపోతుంది.

విటమిన్ కె..
విటమిన్ కే అధికంగా ఉన్న క్యాబేజీ,బ్రోకలి వంటి ఆహారాలను మెడిసిన్ వేసుకున్న వెంటనే తీసుకోకూడదు.దీని వల్ల విటమిన్ కే మెడిసిన్ వాల్యూస్ ని దెబ్బ తీస్తుంది.కావున మెడిసిన్ తీసుకునేవారు,తగిన ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది.

వంకాయ..
ఎలర్జీ గుణాలు కలిగిన వంకాయ,గోంగూర వంటివి మెడిసిన్ వాడిన వెంటనే తీసుకో కూడదు. దీనివల్ల కాళ్ల మంటలు, దద్దుర్లు,నవ్వలు వంటి అలర్జీ గుణాలు అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

యాసిడ్ గుణాలు కలిగిన పదార్థాలు..
ఆసిడిక్ విలువలు కలిగిన చింతపండు,నిమ్మరసం టమోటా వంటి వాటిని, మెడిసిన్ వేసుకున్న వెంటనే తీసుకోకూడదు.ఇవి జీర్ణక్రియ శక్తిని మండగించేలా చేసి, గ్యాస్, మలబద్ధకం, ఆసిడిటి వంటి సమస్యలను కలిగిస్తాయి.

కావున మెడిసిన్ వేసుకునే వారు వైద్యుని సలహాతో తగిన ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: