సెక్సీ స్టార్ లక్ష్మీరాయ్ ఇప్పుడు చాలా కోపంగా ఉంది. కారణం ఏంటంటే... ఈ మధ్య హీరో వినయ్ కీ ఆమెకీ లింకులు పెట్టి ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ ఒకే హోటల్ గదిలో కలసి ఉన్నారని తమిళనాట కొన్ని పత్రికలు కోడై కూశాయి. ఇవన్నీ తెలుసుకున్నాక లక్ష్మీరాయ్ కోపంతో రగిలిపోయిందట. ‘నాపై లేనిపోని కథనాలను అల్లేసి ప్రచారం చేసే హక్కు ఎవరిచ్చారూ’ అంటూ రెచ్చిపోయింది. అంతేకాదు, కొన్ని పత్రికలపై పరువు నష్టం దావా వేసింది. తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. అక్కడితోనూ ఆగలేదు. నష్టపరిహారంగా రూ. 30 లక్షలు చెల్లించాలని పట్టుపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: