యువ హీరో ఆదిత్య అలియాస్ ఆది సాయి కుమార్ హీరోగా డైమండ్ రత్న బాబు డైరక్షన్ లో వస్తున్న సినిమా బుర్ర కథ. టీజర్, ట్రైలర్ తో మెప్పించిన ఈ సినిమా శుక్రవరం రిలెజ్ అనుకున్నారు. కాని ఇప్పటివరకు సినిమా సెన్సార్ పూర్తి కాకపోవడంతో సినిమా ఈ వారం రిలీజ్ కష్టమే అంటున్నారు.


కొత్తగా వచ్చిన సెన్సార్ అధికారి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తుంది. శుక్రవారం రాబోతున్న కల్కి, బ్రోచేవారెవరురా, బుర్రకథ ఈ మూడింటిలో ఆ రెండు సినిమాలకు సెన్సార్ పూర్తి అయ్యింది కాని బుర్ర కథకు మాత్రం సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వలేదట. అయితే బుర్రకథకు మాత్రమే సెన్సార్ ఎందుకు కాలేదన్నది కారణాలు తెలియాల్సి ఉంది.    


అసలే ఆదిత్య హీరోగా నిలబడటానికే ఇంకా ట్రై చేస్తున్నాడు. అలాంటిది అతని సినిమాలకు సెన్సార్ ప్రాబ్లెమ్ రావడం అతన్ని మరింత రిస్క్ లో పడేస్తుంది. బుర్ర కథ టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాలో మ్యాటర్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. కాని సినిమా అనుకున్న టైమ్ కు రిలీజ్ అవడం కష్టమే అంటున్నారు.


అయితే చిత్రయూనిట్ మాత్రం ఈరోజు సాయంత్రం కల్లా సెన్సార్ పూర్తి చేసి శుక్రవారం అనుకున్నది ఒక రోజు లేట్ గా అంటే శనివారం రోజు సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి ఆదిత్య బుర్ర కథ శనివారం అయినా వస్తుందా లేక మరో రిలీజ్ డేట్ చూసుకోవాల్సి ఉంటుందా అన్నది ఈరోజు సాయంత్రం కల్లా తెలుస్తుంది.     



మరింత సమాచారం తెలుసుకోండి: