‘క్ష‌ణం’, ‘గూఢ‌చారి’, ‘ఎవ‌రు’ సినిమాల‌తో హీరోగా వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న అడివి శేష్ కెరీర్ ప్రారంభం నుండి కొత్త తరహా చిత్రాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మల్టీ టాలెంటెడ్ అయిన అడవి శేష్ కి కథ, స్క్రీన్ ప్లే మీద మంచి గ్రిప్ ఉందనే విషయం తెలిసిందే. అలాగే క్రియేటివ్ థాట్స్ తో స్వయంగా స్క్రిప్ట్స్ ని రెడీ చేసుకోవడంలో అడవి శేష్ స్టైల్ చాలా విభిన్నంగా ఉంటుంది. 

 

ఇదిలా ఉండగా అడవి శేష్ నటించిన 'గూఢచారి' సినిమాకి సీక్వెల్ తీస్తానని ఇంతకముందే శేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్వారంటైన్ స‌మ‌యాన్ని అడివి శేష్ వృథా చేయ‌డం లేదు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా షూటింగులు లేక తగినంత సమయం దొరకడంతో అడవి శేష్ 'గూఢచారి 2' స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడట. లిమిటెడ్ బడ్జెట్ తో చిన్న సినిమాగా 2018లో రిలీజైన ఈ స్పై థ్రిల్లర్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సుప్రియ, శోభితా దూళిపాళ్ల, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి సీక్వెల్ గా రాబోతున్న 'గూఢచారి 2' వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉంది. 

 

IHG

 

అడవి శేష్ ప్రస్తుతం 'మేజర్' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించిన చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేశారని సమాచారం. కరోనా ఎఫెక్ట్ తగ్గి లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత మిగతా షూటింగ్ శెరవేగంగా కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. శోభితా దూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. 26/11 ముంబై ఘటనలో వీర మరణం చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో నటిస్తున్నాడు అడవి శేష్. మరి 'గూఢచారి 2' సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లడానికి ఎంత స‌మ‌యం ప‌డుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: