దేశవ్యాప్తంగా గ్రీన్ ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది. చాలామంది సెలబ్రిటీలు సినీ రంగానికి మరియు క్రీడా రంగానికి అదేవిధంగా రాజకీయ రంగానికి చెందిన వాళ్లు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. నాటడమే కాకుండా మరొకరికి చాలెంజ్ కూడా చేస్తున్నారు. ఇతరులను నామినేట్ చేస్తూ దేశవ్యాప్తంగా నాటిస్తున్న ఈ మొక్కల కార్యక్రమం లో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, నాగార్జున, అఖిల్, గోపిచంద్, ప్రభాస్, రోజా పాల్గొన్నారు. క్రీడా రంగానికి సంబంధించి సచిన్ టెండూల్కర్, సైనానెహ్వాల్, లక్ష్మణ్ పాల్గొనగా రాజకీయరంగంలో టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ఇంకా కొంతమంది నాయకులు పాల్గొనడం జరిగింది. 
IHG
అంతేకాకుండా హీరోయిన్ రష్మిక మందన, రాశిఖన్నా, అనుపమ పరమేశ్వరన్ వంటి హీరోయిన్లు కూడా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొనడం జరిగింది. అయితే అంతా బాగానే ఉన్నా మొక్కలు నాటుతూ ఫోటోలకి ఫోజులు ఇస్తున్నా వాటి భవిష్యత్తు గురించి ఆలోచించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ లు చేస్తున్నారు. అంతేకాకుండా నాటిన మొక్క బతుకుతుందో లేదో కూడా పట్టించుకోవాలని కోరుతున్నారు. ఫోటోకి ఫోజులు ఇవ్వటమే కాదు… నాటిన మొక్క భవిష్యత్తులో పెరిగే లాగా బాధ్యత తీసుకోవాలని రోజు నీళ్లు పోసి సంరక్షించాలి అని నెటిజన్లు కోరుతున్నారు.
IHG
 కారణం ఒకరిద్దరు మాత్రమే పెరట్లో నాటగా ఎక్కువగా సెలబ్రిటీలు మొక్కలు అంత బయటే నాటడం తో నెటిజనులు ఈ కామెంట్ చేయడం జరిగింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్నా ఈ  "గ్రీన్ ఛాలెంజ్" కార్యక్రమానికి సెలబ్రిటీల నుండి అద్భుతమైన స్పందన రావడంతో సోషల్ మీడియాలో నాటుతున్న మొక్కలు ఫొటోలు వైరల్ అవుతున్నయి.

మరింత సమాచారం తెలుసుకోండి: