అమలాపాల్ రాఖీసావంత్ లా మారిపోతోంది. భర్తతో విడాకులు, మాజీ లవర్ పై పరువు నష్టం దావాలతో అమలా ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. బెస్ట్ పెర్ఫామర్ అనే గుర్తింపు ఉన్న అమలాపాల్ ని ఇప్పుడో జోకర్ లా చూస్తున్నారు నెటిజన్ లు.


అమలాపాల్ మాజీ బాయ్ ఫ్రెండ్, ముంబయి బెస్ట్ సింగర్ భవిందర్ సింగ్ పై పరువు నష్టం దావా వేసింది. పర్మిషన్ లేకుండా ప్రైవేట్ పిక్చర్స్ లీక్ చేశాడని జనాలని తప్పుదోవ పట్టించేలా రాంగ్ క్యాప్షన్స్ తో ఫోటోలు పోస్ట్ చేసిన భవిందర్ పై యాక్షన్ తీసుకోవాలని చెన్నై హై కోర్ట్ కు వెళ్ళింది అమలాపాల్.


తమిళ డైరక్టర్ ఎ.ఎల్ విజయ్ తో విడిపోయాక, అమలా పాల్ సింగర్ భవిందర్ సింగ్ ని పెళ్ళి చేసుకుందనే ప్రచారం జరింగింది. ఇక భవిందర్ వెడ్డింగ్ కాస్ట్యూమ్ తో ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో వీళ్ళిద్దరు పెళ్ళి చేసుకున్నారనే టాక్ మరింత పెరిగిపోయింది. కానీి అమల అది ఫోటోషూట్ మాత్రమే అని, పెళ్ళి కాదని చెప్పాక, ఆ ఫోటోలని డీలిట్ చేశాడు భవిందర్ సింగ్.

అమలాపాల్ కేస్ ని రాఖీ సావంత్ రేప్ కేస్ తో పోల్చుతున్నారు నెటిజన్ లు. రాఖీ సావంత్ భర్తపైనే రేప్ కేస్ పెట్టింది. ఇప్పుడు అమలాపాల్ మాజీ బాయ్ ఫ్రెండ్ పై పరువునష్టం దావా వేసిందని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ విమర్శలతో అమలా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతోంది. సౌత్ రాఖీ సావంత్ అనే కామెంట్లు వస్తున్నాయి. మొత్తానికి అమలాపాల్ బిహేవియర్ రోజురోజుకూ మారిపోతోంది. తన భర్తతో తెగదెంపులు చేసుకున్నాక.. మాజీ లవర్ పరువు నష్టం దావాలతో ఇమేజ్ బాగానే దెబ్బతీస్తోంది.

అమలాపాల్ మాజీ బాయ్ ఫ్రెండ్.. భవిందర్ సింగ్ పై పరువు నష్టం దావా వేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఏంటి అమలా ఇలా బిహేవ్ చేస్తోంది అని సినిమా జనాలు గుసగుసలాడుకుంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: