ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...విలక్షణ నటుడు అడివి శేష్ అందరి హీరోల కాదు. చాలా డిఫరెంట్ గా సినిమాలు చేస్తుంటాడు. నిజానికి ఈ హీరో చాలా అందంగా మహేష్ బాబు లాగా ఉంటాడు. ఇతను తలుచుకుంటే రొటీన్ లవ్ స్టోరీ సినిమాలు తీసి మంచి హిట్లు కొట్టొచ్చు. కాని వాటికి బిన్నంగా తనకంటూ ఓ గుర్తింపు కోసం ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్నాడు.క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవ‌రు’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో ప్రేక్షకుల మన్ననలు పొంది త‌న‌కంటూ ప్రత్యేక స్థానాన్ని  సంపాదించుకున్నారు అడివి శేష్. ఆయన హీరోగా రాబోతున్న సినిమా ‘మేజర్’. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్‌లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ‘గూఢ‌చారి’ ఫేం శ‌శి కిర‌ణ్‌ తిక్కా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అడవి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా.. తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న  ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఎ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ తో కలిసి  సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. కాగా, శుక్రవారం ‘మేజ‌ర్‌’ లుక్ టెస్ట్ వీడియోను సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ బాబు విడుద‌ల‌ చేశారు. ఈ వీడియోలో ‘మేజర్’ ప్రయాణం ఎలా మొదలైంది.. లుక్ టెస్ట్ ఎలా జరిగింది అనే విషయాల‌ను అడివి శేష్ చెప్పుకొచ్చారు.ఈ సినిమా కోసం 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసాడట. అడివి శేష్.. మేజర్ ఉన్ని కృష్ణన్ త్యాగాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడమే తన లక్ష్యo అని అడివి శేష్ అన్నాడు. ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సహాయం చాలా ఉందని తెలిపాడు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే ఈ సినిమా చిరస్ధాయిలో నిలుస్తుందని చాలా నమ్మకంగా వున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అడివి శేష్ ని గొప్ప స్టార్ హీరోగా నిలబెట్టాలని కోరుకుందాం... ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: