ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... టాలీవుడ్ యువ నటుడు  శర్వానంద్ భారీ సినిమాలకు భయపడకుండా  తను నటించిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’ వంటి సినిమాలను రిలీజ్ చేశాడు. స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి మరీ ఆ సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. కానీ ఈసారి ‘శ్రీకారం’ సినిమా విషయంలో శర్వా వేసుకున్న లెక్క పని చేయడం లేదు. సంక్రాంతికి చాలా సినిమాలు బరిలో ఉన్నాయని.. తన సినిమాను వాయిదా వేసుకోవడం జరిగింది..

ఇక ఈసారి పొంగల్ బరిలో రాబోతున్న సినిమాలాన్ని  కూడా మాస్ కథలే. శర్వానంద్ ‘శ్రీకారం’ గనుక రిలీజ్ అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మెప్పించి ఉండేది. కానీ సరైన ప్లానింగ్ లేక శర్వా తన సినిమా వాయిదా వేసుకున్నాడు. దీంతో ‘శ్రీకారం’ సినిమా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్లైంది. శర్వా నటించిన గత మూడు సినిమాలు ఫ్లాప్ లు కావడంతో ఈసారి రిస్క్ తీసుకోవడం ఎందుకని తన సినిమాను పోటీ లేకుండా రిలీజ్ చేసుకోవాలని భావిస్తున్నాడు.

అయితే ఇప్పటివరకు సినిమా రిలీజ్ విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయానికి రాలేదు. ఫిబ్రవరిలో వసూళ్లు పెద్దగా ఉండవు కాబట్టి వేసవిలో రిలీజ్ చేయాలని శర్వానంద్ నిర్మాతలను అడుగుతున్నాడట. కానీ అప్పుడు సంక్రాంతికి మించిన పోటీ ఉండే ఛాన్స్ ఉంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: